=''/>

22, అక్టోబర్ 2009, గురువారం

కార్తీకవనభోజనాలు

ప్రకృతితో భంధాన్ని ఏటా గుర్తు తెచ్చేదే కార్తీకమాసం .ఈమాసంలో పేద దనిక తేడాలు లేకుండా ఊరంతా కలసి వనాలలో సామూహిక భోజనాలు చేయడం మన సంప్రదాయం.పిల్ల పాపలు పెద్దల తో కలసి ఆడి పాడి సంతోషాన్ని పంచుకొంటారు .


కార్తీకమాసములోనే వనభోజనాలకు ఎందుకు వెళతారంటే - వర్షాకాలము తరువాతే ఈ మాసము వస్తుంది కాబట్టి వనాలన్నీ పచ్చగా వుంటాయి .అందరిలోనూ వుత్సాహము వెల్లి విరుస్తుంది . పల్లె వాసులంతా ఊరికి దగ్గరలో వున్న వనాలకు వెళ్లి ..సహపంక్తి భోజనాలు చేస్తారు .భోజనములో రుచికంటె ,అందరం ఒక చోట కలిసామన్న అనుభూతి మరింత ఆనందాన్నిస్తుంది .ఎలాంటి అడ్దుగోడలు లేకుండా ,బేషజాలకు పోకుండా ఈకార్యక్రమములో పాల్గుంటారు .ఆట,పాటలతో రోజంతా వుత్సాహంగా గడుపుతారు.

ముక్యం గా రావి వుసిరి చెట్ల కింద భోజనాలు ఎందుక చేస్తారంటే ప్రకృతి తో మనిషికున్న బంధాన్ని గుర్తు చేసేందుకు. కలసి భొజనము చేయడములో వున్న సంతృప్తి, ఆనందము దేనిలోను వుండదు కుటుంభం,గ్రామం ,సమాజము వీటన్నింటినీ పటిష్టమంగా వుంచేవి అనుబంధాలే... . అలాంటి బంధాలకు బలాన్ని అందించే దివ్యౌషదం వనభోజనాలు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి