=''/>

26, నవంబర్ 2009, గురువారం

బహుళ కావ్యములను .....

యోగి వేమన మనకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తన పద్యాల ద్వారా తెలియజేసాడు .అందులో ఒకపద్యమిది .
బహుళ కావ్యములను బరికింపగావచ్చు
బహుళ శబ్ద చయము బలకవచ్చు .
సహన మొక్కతబ్బజాల కష్టంబురా
విశ్వదాభిరామ వినురవేమ .
బావము. ...
ఎన్నికావ్యాలైనాచదవవచ్చు .ఎన్నిభాషలైనా మాట్లాడవచ్చు .కానీఓపిక కలిగి ఉండడం చాలా కష్టం .ఓపిక లేనప్పుడు ప్రతీ చోటా మనిషి కోపతాపాలకు గురి అవుతాడు .కోపం మనిషి ఆలోచనను దెబ్బతీస్తాది .చదువుకున్నదంతాఎందుకు కొరగాకుండా పోతుంది .అందుకే మిగతా విద్యా బుద్దులు నేర్చుకోవడము తో పాటు ఓపికను కుడా పెంపొందించుకోవాలన్న నీతినిఈ పద్యం చెబుతుంది .

22, నవంబర్ 2009, ఆదివారం

సుబ్రహ్మణ్య స్వామి షష్టి .

ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్టి .మాజిల్లాలో అత్తిలి లోను ,చాగల్లు లోను షష్టి ఉత్సవాలు (నాకు తెలిసినవి .) బాగాజరుగుతాయి .మాచిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో యాదవోలు అనే ఉరు వెళ్ళేవారము. అక్కడ బాగా జరుగుతుంది. మేము ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు చూసుకొని మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .ఫేమస్ వెంకటరమణ కొత్త సంవత్సరపు కేలండర్ లు ముందు షష్టి దుకాణాల లోకే వస్తాయి .



ఇప్పుడు మాఊరు శివాలయము లోసుబ్రహ్మణ్యస్వామిని ప్రతిష్టించారు.ఉదయమే వెళ్లి స్వామిని దర్శించుకొని వచ్చాను .
ఆస్వామి అందరికీ ఆయురారోగ్యాలు ,సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నాను.

15, నవంబర్ 2009, ఆదివారం

టమాటా,మిరపమొక్కలు.

టమాటాలను మనం ఇంచుమించు అన్నికూరలలోనూ వాడతాము.కొద్దిగా శ్రద్ద పెడితే మనమే ఇళ్ళకాడ కుండీలలో టమాటా మొక్కలును పెంచుకోవచ్చు.
టమటాలను ముక్కలు కోసేటప్పుడు,వాటిలో గింజలను ,ఒకనీళ్ళగిన్నె లోకి తీసుకోవాలి.ఆనీళ్ళను పూల కుండీలో పోస్తే మూడునాలుగు రోజులలో చిన్నచిన్న మొలకలు వస్తాయి .వాటిని జానెడు పొడవు అయ్యే వరకూ ఆకుండీలోనే వుంచి తరువాత వేరే దానిలో వేసుకొంటే రెండునెలలో కాయలు కాస్తాయి .మనము సొంతముగా పండిచిన కూరగాయలతో వండుకొంటే ఎంత తుత్తి గా ఉంటుందండి.
అలాగే మిరపమొక్కలు కూడాపెంచవచ్చు. ఎండుమిరపకాయల డబ్బా కాళీ ఐపోయాక దానిలో అడుగున గింజలు ఉంటాయి .వాటిని పాడేయకుండా పూలకుండీలో వేస్తే మొక్కలు లెగుస్తాయి .వాటిని కొద్దిగా పెరిగాక వేరే కుండీలోవేస్తే అవికూడా రెండు ,మూడునెలలోనే కాపుకొస్తాయి.

14, నవంబర్ 2009, శనివారం

మేము ...మా వనభోజనాలు .


మేము గత మూడేళ్ళ నుండి ప్రతి సంవత్సరము వనభోజనాలు ఎవరో ఒకరిపోలములో పెట్టు కొంటున్నాము .ఇప్పుడు మా కొబ్బరితోటలోపెట్టుకొన్నాము .అంతా కలసి ఓయాభైమందయ్యాము .

మేము (అంటే నేను , రజనిఅని నాకజిన్ ,మాకు అత్తగారు అవుతుంది ( కానీచిన్నదే )రత్నం అని తను ,)ముగ్గురమే అన్నీ చూసుకొన్నాము. ముందు రోజు రాత్రిపనస పొట్టుకూర ,కొత్తిమీర పచ్చిచింతకాయపచ్చడి చేసేసుకొన్నాము.( పనసపొట్టుకూర మరునాడుకి వూరి బాగుంటుంది.).అలాగే మిగతా కూరగాయలు అన్నీసిద్దము చేసుకొన్నాము.


ప్రొద్దుటే వంటమనిషి ,నలుగురు సాయం చేసేవారు వెళ్లి ,మేము అందరమూ వెళ్ళే టప్పటికి వంటకానిచ్చేసారు. ఆరోజు మా మెనూలో ఇంకా యేమిటంటే ...దొండకాయ వేపుడు , కాలీఫ్లవర్ చిక్కుడు ,గుమ్మడికాయదప్పలము, పప్పు ,వుసిరికాయ పచ్చడి .స్వీట్ పాలతాలికలు ,హాట్ పచ్చిమిరపకాయ బజ్జి .

ఇక,మాకు పనేమి లేదు .మేము వెళ్లిన వారిని పెద్దవాళ్ళు ,పిల్లలుగా విడదీసి వారినందరినీ ,మ్యూజికల్ చైర్స్ ,స్పూన్లో నిమ్మకాయ ఆటలు ఆడించాము (మేము కూడా ఆడాము అనుకొండి.) .పెద్దవాళ్ళు అలవాటులేక మేము ఆడము అన్నారు కానీ ఎలాగో ఆడించేసాము .

మేము అందరమూ ఆడవాళ్లమే వెళ్లాము .కావాలనే వెళ్ళాము.మగవాళ్ళు వుంటే సరిగా ఆటలుఆడరు,సిగ్గుపదతారని.. కడుపులో ఎలుకలు పరిగెట్టేవరకూ అలా ఆడుతూనే వున్నాము. కాసేపటికి అందరికి సిగ్గు ,బిడియమూపోయి లైన్లో పడ్డారు. తరువాత కబాడీ ,కో కో ఇలామాయిష్టమొచ్చిన ఆటలన్నీ... అలసిపోయేవరకూ ఆడుతూనే వున్నాము. టైము కూడాతెలియలేదు .అసలే సీతాకాలము కదా ,ఐదున్నరకే చీకటిపడిపోయింది.అందరమూ చాలాబాగా గడిపాము. అందరూ... అప్పుడే వెళ్ళిపోదామా ,ఇంకా కాసేపు ఉందాము అని అంటే అలా అలా ఆరింటివరకూ ఉండిపోయేము .

ఇలా ఆటపాటలతో , ఒక్కకార్తీక వనబోజనా లప్పుడే ఎందుకు గడపాలి ,నెలకో రెండునెలలకో పెట్టుకోవచ్చుకదా అనిపించింది. పెద్దవాళ్ళు ఎప్పుడూ ఏదోఒక పని తో బిజీ గావుంటారు .ఇలాపెట్టుకొంటే వాళ్ళకి కాస్త సరదాగా ఆట విడుపుగా ఉంటుందికాదా ...

ఇవండి మరి మా వనభోజనాల విశేషాలు..

బుల్లిపిట్ట ..బుజ్జిపిట్ట ...




4, నవంబర్ 2009, బుధవారం

పంటినొప్పికి ఇంటిమందు .

పిప్పిపళ్ళ వలన కానీ చిగుళ్ళలో ఇన్ ఫెక్షన్ వలనగానీ ఒక్కొక్కసారి పంటినొప్పి ఎక్కువగా వస్తుంది. అటువంటప్పుడువెంటనే వైద్యుడివద్దకు వెళ్ళటం కుదరకపోతే ఇంటిలో ఉన్న వాటితోనే కొన్ని చిట్కా మందులు చేసుకొని వాడవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఉల్లిపాయముక్కను కోసి పెట్టవచ్చు . ఐసుముక్కను గుడ్డలో పెట్టి నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతుంది . లవంగనూనె,వెల్లుల్లి కూడా వాడవచ్చు .ఉప్పునీటిని పుక్కిలించి ఊసినా మేలు కలుగుతుంది .వెనిల్లా ఒకటి రెండు చుక్కలు నెప్పిగా ఉన్నచోట వేయవచ్చు .ఇంకా చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా నమిలినా బాధ కొద్దిగా తగ్గుతుంది . ఇంగువలో నిమ్మరసం కలిపి దానిలో ముంచిన
దూదిని పంటిపైన పెట్టుకుంటేకూడా నొప్పితగ్గుతుంది.

3, నవంబర్ 2009, మంగళవారం

అందినద్రాక్ష పుల్లన .


అదేంటి ,అందిన ద్రాక్ష పుల్లన అంటున్నాననుకొంటున్నారా ....... అసలుకదేమిటంటే..మా ప.గో.జిల్లాలో వారికి అసలుద్రాక్షపాదులు ఎలా ఉంటాయోతెలియదు.అటువంటిది ఈమధ్యన అందరూ కడియం నర్సరీ(మాకు కడియం నర్సరీ లు బాగా ఫేమస్) నుండి ద్రాక్ష పాదు లు తెచ్చి ఇళ్ల వద్ద పెంచుతున్నరు .అది చూసి మేము కూడా ఒకటి తెచ్చివేసాము .కొన్ని రోజులకి అది బాగాపెరిగింది .పూత కూడా బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా కాయడం మొదలుపెట్టింది .ఇక మేము అవి ఎప్పుడు పండుతాయా ,యెప్పుడు తిందామా అని యెదురు చూస్తూఉన్నాము. మేము ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది .చాలా ఆత్రంగా తయారైన గుత్తులన్నీ కోసేసేము .తీరా తిందామనినోట్లో పెడితే పుల్ల పుల్లగా వగరుగా ఉన్నాయి.అప్పుడు అనుకొన్నాము ,అందిన ద్రాక్ష కూడా పులుపేనని. . అప్పటి నుండి వాటిని యేమి చేయాలో తెలియక వాటితో పప్పు చారు కాస్తున్నము .నిజమండిబాబు. పచ్చి గుత్తులను కోసి కాయలను ఉడకబెట్టినీళ్ళు పిండి పప్పు లోవేసి ,ఉప్పు కారం వేసి ఉడికిస్తే ... ద్రాక్షకాయలతో పప్పుచారు రెడీ . . ఎలాఉందండి మాద్రాక్షకాయల పప్పుచారు.... .

2, నవంబర్ 2009, సోమవారం

బ్లాగ్ వనంలో వనభోజనాలు -గుమ్మడికాయ దప్పళం .

మా వైపు ఫంక్షన్లలో ఎక్కువగా గుమ్మడికాయ దప్పళం వండుతారు.
దీనికీ కావలసిన పదార్దాలు ...
గుమ్మడికాయ -చిన్నది ఒకటి .
ఉల్లిపాయలు -రెండు .
పచ్చిమిర్చి -ఆరు
బెండకాయలు -పది .
టమాటాలు -మూడు .
ములక్కాడ -ఒకటి .
వంకాయలు -రెండు .
కొత్తిమీర-ఒకకట్ట .
పోపు పెట్టుకోవడానికి ..
మెంతులు -అర స్పూను
ఆవాలు -అరస్పూను
జీలకర్ర -అరస్పూను

ఎండుమిరపకాయలు-నాలుగు.కరివేపాకుకొద్దిగా .
చింతపండు కొద్దిగా .
బెల్లం కొద్దిగా .
తయారుచేసేవిదానం .....
..
స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించి దానిలో నీరు పోసి,గుమ్మడికాముక్కలువేయాలి .అవి ఉడుకుతుండగా , ముక్కలుగాకోసుకొన్న కూరగాయముక్కలు దానిలోవేయాలి. ఉల్లిపాయలను చీరికలుగా కోసుకోవాలి.అవి, పచ్చిమిర్చి ముక్కలులుకూడా వేసుకోవాలి .కొద్దిగా వుడికాక ,కారము ,ఉప్పు ,పసుపు వేసుకొని,చింతపండుపులుసు ,బెల్లముకొద్దివేసుకోవాలి.కాసేపు ఉడికేక స్టవ్ కట్టేసుకొని తాలింపు పెట్టుకొని ,కొత్తిమీర జల్లుకోవాలి .

దీనిని ముద్దపప్పులొకలుపుకొని తింటే ఉంటుందీ ..........

పపపపప్పు ..దప్పళం ......వేడి వేడి అన్నం మీద....కమ్మనిపప్పు కాచిన నెయ్యి ...కలిపితే ..భొజనం వనభొజనం ......