=''/>

31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


కరిగే కాలాన్ని నీవు ఆపలేవు ..
జరగబోయే దాన్ని నీవు ఆపలేవు ..
ఉన్న వాటితో నీవు ఆనందించు ..
హాయగానవ్వుతూ జీవించు..
అందరికీ ఆనందాన్ని పంచు ..
కష్టాలను దైర్యముతో ఎదిరించు ..
నీకు నీవే సాటని నిరూపించు ..
కలకాలం సంతోషముగా జీవించు .
నూతన సంవత్సర శుభా కాంక్షలు

29, డిసెంబర్ 2009, మంగళవారం

కోత యంత్రం తో వరి చేను కోతలు


మా వరిచేను కోతలు పూర్తయ్యాయి .గతరెండేళ్ల నుండి కోతమిషన్ సాయం తో వరిచేలు కోస్తున్నారు .
కూలీ ఖర్చు బాగా పెరిగిపోయి చాలా మంది మిషన్ తో కోయడానికే ఇష్టపడుతున్నారు . కూలీ లు పన్నెండు మంది

రోజుకి ఒక ఎకరం కోస్తే ,మిషన్ గంటలో ఎకరం కోస్తుంది .మళ్ళీ వాళ్ళను తీసుకురావడాము ,పంపడము చేయాలి .
మిషన్ వచ్చాక ఆ గొడవలేమి ఉండడములేదు .కోసేవాడు మిషన్ తో వచ్చి కోసేసి వెళుతున్నాడు .

ఇప్పుడు కూలీ రేట్లు కూడా బాగా పెరిగి పోయాయి . ఆడవాళ్లకు నూటయాబై ,మగవాళ్లకి రెండువందల
యాబై తీసుకొంటున్నారు .మిషన్ కి ఐతే ఎకరాని కోయడానికి ఈ సంవత్సరము తొమ్మిది వందలు తీసుకొన్నారు .నిరుడు కొత్త కావడం,మిషన్లు కూడ తక్కువ వుండముతో పదిహేను వందలు తీకున్నారు .ఎక్కువగా అవితమిళనాడునుండి వచ్చాయి .ఈ సంవత్సరము కొంతమది రైతులు కలసి మిషన్లు కొన్నారు అందుకే కొద్దిగా రేటు కూడా తగ్గింది .

మిషన్ వచ్చాక మావాళ్లకు మాత్రం చాలా హాయి గాఉంటుంది .వాళ్ళు ఎంతమంది వస్తారో ,ఎప్పుడు వస్తారు అన్న టెన్షన్ లు ఏవీ ఉండటము లేదు . రెండు రోజులలో నే కోతలు అయిపోతున్నాయి .

ఇలా అన్ని పనులకు మిషన్ లు వస్తే వ్యవసాయము చేయడము తేలిక అవుతుంది . ఖర్చులు కూడా తగ్గుతాయి .

28, డిసెంబర్ 2009, సోమవారం

తేగలు


తేగలు వచ్చేసాయండి. సితాకాలము వస్తే మా ఏరియాలో బస్సులు ఆగేచోట,రోడ్లమీద తేగలు అమ్మేవారి సందడి ఎక్కువగా వుంటుంది .
పొలాలలోను, రోడ్లపక్కన తాటిచెట్లవద్ద తాటిటెంకలు అన్నీ సేకరించి వాటినిపాతర వేస్తారు .అంటే పెద్ద గొయ్యి తవ్వి దానిలోకప్పెడతారు .అవి సితాకాలము వచ్చేటప్పటికి మొలకెత్త డానికి తయారవుతాయి . వాటిని తీసి కుండలో పెట్టి కింద మంట పెట్టి కాలుస్తారు .
తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది .ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .
ఇదివరకు ఎవరిపొలాలలో వాళ్లు తాటిటెంకలను ఏరించి పాతరలు వేసేవారు .
ఇప్పుడు రైతులు కూడా కొనుక్కోవడానికి అలవాటుపడిపోయారు .

21, డిసెంబర్ 2009, సోమవారం

చెడ్డ సోమవారం .

ఈ రోజు రెండు చెడ్డ విషయాలు జరిగాయి .

ఒకటి , మా చెరుకుతోట కు నిప్పంటుకుని కాలిపోయింది . మా చెరుకుతోట

దగ్గరలో ,వేరే వాళ్ళ పొలములో తుక్కుకి నిప్పు పెడితే అదికాలి అలా అలా

మాతోట కూడా అంటుకుందంట. గాలి కూడా బాగా ఉండటముతో మంటలు

తోందరగా ఎగబాకి కాలిపోయింది . చెరుకు కొట్టే కూలీ లు నాలుగురూజులు
నుండి ఈ రోజు వస్తాము ,రేపోస్తాము .. అని చెప్పి రాలేదు .
లేకపోతె కొట్టడము అయిపోను .రైతు పరిస్తితి ఇంతే కదండీ . ఎలాగో వర్షాలు
లేకపోయినాకష్టపడి పెంచితే ,సరిగ్గా కొట్టే టైంకి కాలిపోయింది .

రెండోది , మాకు తెలిసిన కరెంట్ లైన్మన్ షాక్ కొట్టి చనిపోయాడు .వాళ్ళ నాన్న

మాపొలము వచ్చేవాడు . ఈ అబ్బాయి చాలా కష్టపడి పైకివచ్చాడు
.
మధ్య ఎవరిదో పొలము కౌలుకి తీసుకొని వాళ్ళ నాన్న తో వ్యవసాయం

కూడా చేయిస్తున్నాడు .ఆ కౌలు తీసుకొన్న పొలము లోనే ట్రాన్స్ ఫారం

బాగు చేస్తుంటే ఇదిజరిగింది.విన్న మాకు చాలా భాద కలిగింది .

18, డిసెంబర్ 2009, శుక్రవారం

సెలవలు

మాకు (అదే మా అబ్బాయికి )సమైక్యాన్ద్రా సెలవలు వచ్చాయోచ్ .అసలు వాళ్ళ బడికి సెలవలు చాలా తక్కువ గా ఇస్తారు . అలాగని అదేమీ కార్పోరేట్ స్కూల్ కాదు .మా పక్క ఊరిలోని చిన్న ప్రైవేట్ స్కూల్ . కాని పెద్ద కార్పోరేట్ స్కూల్ లాగా ఫీలవుతూ ఉంటారు . ఈ సమైక్యాన్ద్రా ఉద్యమం వచ్చాక వాళ్లకు వారం రోజులు సెలవలు ఇచ్చారు .

మా బాబు డౌట్ ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు సెలవలు ఇచ్చారు కదా ,తరువాత సెలవలు తగ్గించేస్తారేమో అని . వాళ్ళకి ఇదివరకు ఇలాగే వర్షాలు ఎక్కువగా వస్తే రెండు రోజులు సెలవలిచ్చి తరువాత ఆదివారము స్కూల్ పెట్టారు . హాయిగా, వచ్చిన సెలవలు తో ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు రోజూ నా బుర్ర తింటున్నాడు .సంక్రాంతికి సెలవలు మూడు రోజులే ఇస్తారేమో అని ,ఇంకా చాలా ..చాలా డౌట్ లతో.

ఈ ఉద్యమం వలన అన్నిస్కూళ్ళ పరిస్తితి ఇలాగే వుంది .ఇప్పుడు హాఫ్యార్లీ పరిక్షల రోజులు .పరీక్షలకు సిలబస్ ఇప్పుడిప్పుడే అవుతుంది .ఈ అనుకోని సెలవల వలన స్కూళ్ళ షెడ్యూళ్ళు అన్నీ మారిపోతాయి .

మాపాప విజయవాడ లో హాస్టల్ లో ఉంటుంది .వాళ్లకి ఇప్పుడు పరిక్షలు జరుగుతున్నాయి .అక్కడైతే గొడవలు ఎక్కువే జరుగుతున్నాయి కానీ వీళ్ళకి పెద్దగా సమస్య లేదంట .వీళ్ళ స్కూల్ ఎక్కడో పొలాలలో ఊరికి దూరంగా ఉంటుంది .ఎలాగో పరిక్షలు ఐపొతే తరువాత ఇంటికి పంపించేసినా పరవాలేదు .
ఈగొడవలు ఎప్పటికి అవుతాయో కాని , మేము మాత్రం సెలవలుకి కాకినాడ వచ్చాము . మాచెల్లి పిల్లల తో మావాడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు .

16, డిసెంబర్ 2009, బుధవారం

ఒవెన్ లేకుండానే బిస్కట్లు చేయడం .

*బిస్కట్లు చేయడానికి కావలసిన పదార్ధాలు .
మైదా పిండి -అరకేజీ
పంచదార -పావుకేజీ ,పొడి చేసుకోవాలి.
నెయ్యి -రెండు వందల గ్రాములు .
యాలికల పొడి కొద్దిగా
వంట సోడా -ఒక స్పూన్.
తయారు చేయు విదానం ***

ఒక పెద్ద ప్లేట్ లో మైదా పిండి ,పంచదార పొడి ,నెయ్యి ,సోడా ,యాలిక పొడి వేసి బాగా కలుపుకోవాలి .దీన్ని బాగా కలుపుకొంటే నెయ్యి పైకి తేలుతుంది .ఇప్పుడు చపాతీలు చేసుకొనే పీట మీద ఈ పిండిని వేసి చేతితో పీట అంతాసమానము గా పరుచుకొని చేతితో వత్తాలి .ఇప్పుడు మనకు కావలసిన సైజు లో గుండ్రము గా కాని ,అర్ధ చంద్రాకారము లో కాని కోసుకోవాలి .(చిన్న డబ్బాముతా ను కోయడానికి ఉపయోగించవచ్చు .)
ఇప్పుడు పాత పెనముకాని ,కుక్కరు పాన్ కాని తీసుకోని దానిలో కొద్దిగా ఇసుక వేసుకోవాలి .
దానిని స్టౌ మీద పెట్టి వేడి గా అయ్యాక దానిమీద కోసుకొన్న బిస్కట్లను ఒక సేమంది ప్లేటు లోకాని (స్టీలు ప్లేట్ ఐతే అడుగున అంటుకు పోయి సరిగారావు ),కేకు చేసుకొనే గిన్నెలో కాని అడుగున నెయ్యి రాసి వాటిని జాగర్తగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి .చిన్న మంట మీద వేగనివ్వాలి .అడుగున కొద్ది గా ఎరుపు రంగు వస్తే వేగి పోయినట్టే .

15, డిసెంబర్ 2009, మంగళవారం

విష్ణువుకి ప్రియం ధనుర్మాసం .సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది .
ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .
ధనుర్మాసం అంటే
ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .
ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .
ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .
ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది .
ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .

11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఒకటికాదు పదకొండు.

సోనియా అమ్మ తెలంగాణాకి సైఅనగానే , మారాష్ట్రాలను కుడా విడదీయన్డి అని మిగిలిన రాష్ర్టాలు కూడా గొడవలు మొదలు పెడతాయి .
వెస్ట్బెంగాల్ లో గుర్కాలాండ్ ను విడయాలని వాళ్లు మొదలు పెడుతున్నారట .
బుందేల్ ఖండ్ -మధ్యప్రదేశ్ .
హరితప్రదేశ్ -ఉత్తరప్రదేశ్
మిదిలాన్చల్ -బీహార్
కూర్గ్ -కర్నాటక
భోజ్పూర్ -ఉత్తరప్రదేశ్ బిహార్ల మద్య
విదర్బ -మహారాష్ట్ర
తమిళనాడు కుడా దక్షిణ తమిళనాడు ని విదదీయమని అంటుంది .ఇంకా ఉన్నాయంట .
ఇలా రాష్ట్రాలు ప్రత్యేకరాష్ట్రాల కోసం డిమాండ్ చేయడం మొదలు పెడతాయి .వాళ్ళకి తెలంగానే స్పూర్తి అంట .
ఇప్పటికే తెలంగాణ ఇస్తామని తప్పు చేసామేమో అని తల పట్టుకొన్నారు .ఇక వాళ్లు కుడా మొదలు పెడితే అప్పుడు ఉంటుంది,సోనియా పని ...............

10, డిసెంబర్ 2009, గురువారం

నేను చేసిన వర్కులు 2.

క్రిందవి రెన్డూమాపాప పరికిణీ మీదకుట్టినవి.
పైది ఫాబ్రిక్ పైంటింగ్. ఎప్పుడో పెళ్లి కాక ముందు ఫాబ్రిక్ పైంటింగ్ నేర్చుకున్నాను .నాకు ఆర్టు అంటే ఇష్టం కానీ ,నేర్చుకోవడము కుదరలేదు .మాకు దగ్గరలో నేర్పే వాళ్లు ఉండరు. ఆ ఇష్టము తో నే ఫాబ్రిక్ పైంట్ నేర్చుకున్నాను .ఎప్పటికైనా బొమ్మలు వేయడము నేర్చుకోవాలని నాకోరిక .









8, డిసెంబర్ 2009, మంగళవారం

చీరల మీద నేను చేసిన వర్కులు .

నాకు చీరల మీద వర్క్ లు చేయడం చాలా ఇష్టమైన హాబి .నేను డిగ్రీరెండో సంవత్సరము చదివేటప్పుడు మా హాస్టల్ లో కొంతమంది కుట్టేవారు .వాళ్ల వద్ద నేర్చుకొని మొట్టమొదటి సారిఒక చీర మీద కుట్టేను .అందరూ బాగా కుట్టేవు అన్నారు .అలా మొదలుపెట్టి కొత్త కుట్లు అన్నీనేర్చుకొని కుట్టడం మొదలు పెట్టాను
ఇమద్య ఒకావిడ మగ్గం వర్కులు నేర్పుతుందని తెలిసి ఆవిడను మాఊరు రప్పించి కొంతమందిమి కలిసి నేర్చుకొన్నాము .ఒక దాని మీద అయ్యాక ఒకదాని మీదఎప్పుడూ కుడుతూ ఉంటాను .మాపాప పరికినీల మీద కూడాకుడతాను
ఇవినాకు ఇష్టమైన వాటిలో కొన్ని .మిగిలిన వాటితో తరువాత టపాలో కలుద్దాము .


6, డిసెంబర్ 2009, ఆదివారం

టెస్ట్ క్రికెట్ లో భారత్ నెంబర్ 1



టెస్ట్ క్రికెట్ లో మనభారతదేశం " ప్రపంచ నెంబర్ వన్ "అయ్యింది .

శ్రీలంక తో జరిగిన మూడో టెస్ట్ లో మన దేశం ఇన్నింగ్స్ ఇరవైనాలుగు పరుగులతో గెలుపొంది భారతదేశ చరిత్ర లోనే మొదటిసారి ప్రపంచ నెంబర్ వన్ అయ్యింది .మూడు టెస్టు ల సిరిస్ లో రెండింటి లో గెలుపొంది ఈ ఘనత సాధించింది.

ఈ గెలుపు తో నూటఇరవైనాలుగు రేటింగ్ పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని పొందింది.

ఈ విజయాన్ని సాధించిన మన జట్టుకి" శుభాకాంక్షలు ".

3, డిసెంబర్ 2009, గురువారం

చిలకమ్మల కబుర్లు .




అబ్బ వీళ్ల జామ చెట్టుకి కాయలు చాలా ఉన్నాయే ... ఈ మధ్య కోతులు రాలేదో యేమిటో.. అనుకొంటూ ఒక చిలుకమ్మ మాజామ చెట్టు మీద వాలిందితొందరగా తినెయ్యాలి.ఎవరైనా వస్తారు .


అబ్బ చాలా రుచిగా ఉంది ఈకాయ.ఎవరైనా చూస్తే కొట్టేస్తారు .అమ్మో ..అవిడ చూసేసింది.అదేమిటి కర్ర తెస్తుందనుకొంటే ,కెమేరా తెచ్చింది . అనుకుంది. ఓయ్ ...తొందరగా నువ్వు కూడా రావే ,ఆవిడ మనకు ఫొటో తీస్తుంది.అనుకొంటూ ఇంకో చిలుకమ్మను కూడా పిలిచింది .

ఎలా ఉన్నామంటావు ఫొటోలో ,అని ఒక చిలుకమ్మ ఇంకొక చిలుకను అడిగింది . మనకేం సూపర్ గా ఉంటాము.ఇంకా వాళ్ళే ఫొటో తీసుకోవడానికి మేకప్పై ,లిప్స్టిక్కులూ గట్రాలూ పూసుకుంటారుఅని ఇంకో చిలుక అంది.

మాజామ చెట్టు మీద రోజూ చిలుకలువాలి జామకాయలన్నీ తినేస్తాయి. వాటిని చూస్తూ సరదాగా అవి ఇలా అనుకొంటే ఎలా ఉంటుంది అని ఊహించి వ్రాసాను. ఎలాఉందో చెప్పండేమరి.