=''/>

28, సెప్టెంబర్ 2009, సోమవారం

విజయదశమి శుభాకాంక్షలతో

దశమిరోజున తప్త కాంచనకాంతితో ,కోటిసూర్య సన్నిభమైన ప్రభాజాలముతో,రత్నభూష భూషితమైఅలరారుతారు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి.సర్వ మానవ జీవితాలలో సర్వశక్తికి కేంద్ర స్థానం జగజ్జననే .అడ్డంకులను ఎదుర్కునే శక్తిని ,లొక కళ్యాణ కార్యాలలో విజయాన్ని ప్రసా దించమని ఆ తల్లిని స్వచ్చమైన మనసుతో వేడుకుంటె ఆమె సహ్రుదయ స్వరూపిణియై అశీర్వదిస్తుంది .దసరా పేరుతో మనం జరుపుకొనే విజయదశమి చెడుపై విజయానికి ప్రతీక .

అందరూ సఖ సంతోషాలతో ,అయురా రోగ్యాలతో వుండాలని ఆశిస్తూ అందరికీ ,
దసరా శుభాకాంక్షలు


23, సెప్టెంబర్ 2009, బుధవారం

తొమ్మిది రోజుల ఉత్సవాలు

ఆశ్వయుజ మాసం లో వచ్చే అమావాస్య తరువాతి రోజున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి .తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగల సంబరాలు చివరిరొజూ ,పదవరోజైనవిజయదసమిరోజునలేదా దసరా రోజున ముగుస్తాయి .
ఈతోమ్మిది రోజులూ అమ్మ రకరకాలుగా దర్సనమిస్తుందని

పెద్దల విశ్వాసం .మొదటిరోజు బాల, రెండోనాడు లలిత ,మూడోరోజు తరుణి, నాలుగోనాడు సుమంగళి ,ఐదవరోజు సతేక్షి ,ఆరోనాడు శ్రివిద్యారుపిని ,ఏడూ రోజు మహాదుర్గ ,ఎనిమిదో రోజు మహాలక్ష్మి ,తొమ్మిదోరోజు సరస్వతి ,పదవరొజున శివశక్తి ఐక్యరుపిని .
కొలువుగా బొమ్మలను తీర్చిన ప్రతి ఇంటిలోనూ ఈ తొమ్మిదిరోజులు, ఇళ్ళకు వచ్చిన అందరికీ తాంబూలం ,దక్షిణ ,నైవేద్యవస్తువులు తప్పకుండా ఇవ్వాలి .తోమ్మిదిరోజులుపూజలు చేయలేని వారు చివరి మూడు రోజులైన సప్తమి ,అష్టమి ,నవమి రోజులలోనైనా చేసుకుని ,విజయదసమి రోజున ముగించాలి ..చదువులతల్లి అయిన శ్రీసరస్వతీ పూజ రోజున పుస్తకాలు ,సంగీతవాయిద్యాలు ,పనిముట్లు పూజలో పెట్టాలి .మరునాడు విజయదసమి రోజున పుజతరువాత తీయాలి .ఆయా వృత్తులవారు తమ గురువులను పూజించి ,వారికి గురుదక్షిణలిచ్చి కోలుచుకోవాలి .వారి దీవెనలు అందుకోవాలి .క్రొత్తవృత్తుల ప్రారంభానికి విజయదసమి అత్యుత్తమమైనది .ఆరోజు రాత్రి బొమ్మలకు పాలనైవేద్యము సమర్పించి ,బొమ్మలను పడుకోబెట్టాలి .మరునాడు వాటిని తీసి ,మరుసటి సంవత్సరం దేవికి స్వాగతం చెప్పేందుకు సిద్దం కావాలి .

14, సెప్టెంబర్ 2009, సోమవారం

గాలివానలో ......


అప్పుడు ఎనిమిదోవతరగతి చదువుతున్నాను .మా ఉరిలో స్కూల్ లేకపోవడముతోమా ప్రక్క ఉరిలో బడికి రోజు నడచి వెళ్ళేవారము .(ఇప్పుడు కూడా లేదు ).నేను ఆరవతరగతిలోచేరేటప్పటికి చాలామంది వుండేవారు .నేను ఎనిమిదోతరగతికి వచ్చేటప్పటికి చాలమంది పదవతరగతి ఐపోయిమానేసారు . ఆడపిల్లలము ముగ్గురుమే వుండేవారము .ఆరోజు ఎవ్వరూ రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను .మబ్బుమబ్బు గా వుండి కొద్దిగా వర్షం కూడాపడుతుంది . వర్షం పడుతున్నదని బడికి మద్యాహ్నము నుండి సెలవు ఇచ్చారు .ఇంటికి బయలుదేరాను. కొంచెం దూరము వచెటప్పటికిబాగా మబ్బుపట్టి గాలివాన రావటం మొదలైంది .నాకు బయ్యం వేసి దేవుడుని తలచుకొంటూ తొందర తొందరగా నడుస్తున్నాను .దారి లో ఒక చెరువు వుంటుంది . దానిలోకి ఉరిలో కురిసిన వర్షము నిరు చేరి అది పొంగి పోర్లుతున్నది. దానితో ఏమి చేయాలో తెలియక భయ్యం తో బిక్కమొఖం వేసుకొని నుంచున్నాను (గొడుగు వుందిలెండి ).ఇంతలొ పోలాలనుండి ఇళ్ళకు వెళ్ళే కూలీలు చూసి వారితోపాటు నన్నుకూడా చెరువు దాటించారు .ఎలాగో ఇంటికి వచ్చాను. ఆదెబ్బతో తొమ్మిదో తరగతి లో స్కూల్ మార్పించేసారు .తొమ్మిది ,పది మా మావయ్య గారి ఇంటి వద్ద నుండి వెళ్లి చదువుకున్నాను .ఇది జరిగి చాలా ఏళ్ళు ఐనా గాలివానా వస్తే అదే గుర్తుకోస్తాది .

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సెల్ తో చెర్మానికి ముప్పు .

ఈమద్యకాలంలో సెల్ ఫోన్ లేని చెయ్యే కనిపించడం లేదు. పిల్లలు నుంచి పెద్దల దాకా సెల్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోతున్నారు
కూరలు అమ్మే వారి దగ్గర నుంచి పాలేరు వరకూఅందిరి వద్దాసెల్ ఫోన్ లే వుంటున్నాయి .
ఫోన్ ను ఎంతగా వాడితే అంతగా చెర్మానికితిప్పలు తప్పవు అంటున్నారుపరిసోదకులు .చాలా సెల్ ఫోన్ హ్యాండ్ సెట్లలో కనిపించే నికిల్ చర్మ సంభందిత వ్యాధుల కు కారణం కాగలదని,దీని వల్ల మొబైల్ ఫోన్ డేర్మ టైట్స్ అనే చర్మ సమస్య తలేతే అవకాసం వుంది అని బ్రిటిష్ చర్మ నిపుణులు అసోసియేషన్ హెచ్చరించింది.
బుగ్గలు,చుబుకం,చెవులు పై రాష వస్తుందనిచర్మ నిగారింపు కూడా దెబ్బ తింటుందని వారు పేర్కొన్నారు .ఫోన్ లలో నికిల్ వాడకాన్ని గురించి తయారిదార్లను అరా తీసి మరీ కొనాలని వారు సూచిస్తున్నారు .
కనుక సెల్ఫోన్ వాడేవారు జాగ్రత్తమరి .


9, సెప్టెంబర్ 2009, బుధవారం

రోజాది ఐరెన్ లెగ్గా ?

రోజా తెలుగుదేశం లోచేరిన కొన్ని నెలలకు చంద్రబాబునాయుడు మందుపాతర ప్రమాదం లో బ్రతికి బయట పడ్డాడు .ఇప్పుడు కాంగ్రెస్స్ లో చేరటానికి రాజసేకరరెడ్డి ని కలిసింది .
ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు .
పాపం రోజా పని ఐపోయింది .ఇప్పుడు రోజా ఏమీచేయలేదు .చంద్రబాబుని విమర్శించినందుకు రాజీనామాఇవ్వకతప్పలేదు .ఇప్పుడు కాంగ్రెస్స్ లో తనను ఎవ్వరూపట్టించుకోరు .మహిళాకాంగ్రెస్ అద్యక్షురాలు గంగాభవాని ని రోజా చాలా విమర్సించింది. తను చాల వ్యతిరేకిస్తుంది .చూడాలి మరి రోజా ఏమి చేస్తుందో .

3, సెప్టెంబర్ 2009, గురువారం

మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి మరణము చాలా భాద కలిగిస్తున్నది
అందరికి నా సానుబూతితెలియజేసుకుంటున్నాను .