=''/>

30, అక్టోబర్ 2009, శుక్రవారం

మా ఊరు ..

మాఊరి పేరు గాంధీనగరం .
మాఊరి కి ఒక చిన్న చరిత్ర వుంది .ఇప్పుడు మాఊరు చోట ,మాతాతగారినన్నాగారు వాళ్ళకి పొలాలు వుండేవట . రోజూ ఇక్కడకు వచ్చి వ్యవసాయం చేయించేవారట .మా ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది.వర్షాకాలములో ఆచెరువునిండి బాగాపొంగి పొర్లుతావుండేదట.ఒక్కొక్కసారి పొలాల్లోకి వెళ్ళినవారు రెండు ,మూడు రోజు లవరకూ ఇళ్లకు వెళ్లడానికి లేకుండా ఇబ్బంది పడేవారంట .ఇక్కడ పొలాలు ఉన్న నాలు కుటుంబాల వారు ఈ ఇబ్బందులు పడలేక ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలనుకొని గ్రామాన్ని యేర్పరుచుకొన్నరు .

అవి స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజులవటముతో" గాంధీనగరం"అని పేరుపెట్టేరట.

అలా మాఊరు" పంతొమ్మిదివందలముప్పైఎనిమిది "లో యేర్పడిందనమాట .ఆనాలుగు కుటుంభాల వారి పిల్లలు ,మనుమలే మాఊరిజనాబా .మాఊరిజనాబా రెండువందలకంటే ఎక్కువుండదు . అందరూ ఒకరికొకరు దగ్గరివాళ్ళకే పెళ్ళిళ్ళుచేసుకోవడముతో ఊరిలో పెళ్ళైనా ,పేరంటమైనా అందరూ కలసి మెలసి చేసుకొంటాము .

22, అక్టోబర్ 2009, గురువారం

పోషకాలు మెండుగా వుండే శ్రీ ఫలం .

కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి.కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు.కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే .వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి .కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు .
కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది .ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది .కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు .
మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు .

కార్తీకవనభోజనాలు

ప్రకృతితో భంధాన్ని ఏటా గుర్తు తెచ్చేదే కార్తీకమాసం .ఈమాసంలో పేద దనిక తేడాలు లేకుండా ఊరంతా కలసి వనాలలో సామూహిక భోజనాలు చేయడం మన సంప్రదాయం.పిల్ల పాపలు పెద్దల తో కలసి ఆడి పాడి సంతోషాన్ని పంచుకొంటారు .


కార్తీకమాసములోనే వనభోజనాలకు ఎందుకు వెళతారంటే - వర్షాకాలము తరువాతే ఈ మాసము వస్తుంది కాబట్టి వనాలన్నీ పచ్చగా వుంటాయి .అందరిలోనూ వుత్సాహము వెల్లి విరుస్తుంది . పల్లె వాసులంతా ఊరికి దగ్గరలో వున్న వనాలకు వెళ్లి ..సహపంక్తి భోజనాలు చేస్తారు .భోజనములో రుచికంటె ,అందరం ఒక చోట కలిసామన్న అనుభూతి మరింత ఆనందాన్నిస్తుంది .ఎలాంటి అడ్దుగోడలు లేకుండా ,బేషజాలకు పోకుండా ఈకార్యక్రమములో పాల్గుంటారు .ఆట,పాటలతో రోజంతా వుత్సాహంగా గడుపుతారు.

ముక్యం గా రావి వుసిరి చెట్ల కింద భోజనాలు ఎందుక చేస్తారంటే ప్రకృతి తో మనిషికున్న బంధాన్ని గుర్తు చేసేందుకు. కలసి భొజనము చేయడములో వున్న సంతృప్తి, ఆనందము దేనిలోను వుండదు కుటుంభం,గ్రామం ,సమాజము వీటన్నింటినీ పటిష్టమంగా వుంచేవి అనుబంధాలే... . అలాంటి బంధాలకు బలాన్ని అందించే దివ్యౌషదం వనభోజనాలు .

16, అక్టోబర్ 2009, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి పండుగ లో ఒక ప్రత్యేఖత ఉంది .దుష్టశిక్షణ ద్వారా జనవళికి శాంతిని ప్రసాదించిన పర్వదినం.దీపాలువెలిగించి ,ఇంటింటినీ అలంకరించుకొని పెద్దలుతమసంతొషాన్ని ప్రకటిస్తారు.పిల్లలు బాణాసంచా కాల్చి తాము వినోదించడమే కాక చూపరులందరినీ ఆనందపరుస్తారు . ఎన్నిపండుగలు వున్నా, దీపావళి కి సాటి రాగల వేడుక మరొక దానికి లేదు . టపాసులు కాల్చేటప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్త .
అందరికీ దీపావళి శుభాకాంక్షలు .

9, అక్టోబర్ 2009, శుక్రవారం

పశ్చిమావని ...సిరులగని

ఎటుచూసినా పచ్చదనం ..పైటేసిన పడుచులా మాగాణి భూముల్లొ పైరుపచ్చని పంటలు ,గోదావరి పరవళ్ళు , ఉరకలు వేసే పంట కాల్వలు, అప్పుడప్పుడు,ఆగ్రహించినా ఎల్లప్పుడూ గోదారమ్మ చల్లని చూపులతో డెల్టా భూముల్లో పండే సిరులు ,పుష్కలమైన జలవనరులు ,వాణిజ్య పంటలతో కళకళలాడే మెట్ట పొలాలు ,అడవితల్లి ఒడిలో సేదదిరే గిరిజనం ,అటు సాగరతీరం ,ఇటు ఎత్తైన పాపికొండలు ,కనువిందు చేసే తుర్పుకనుమలు ,ఇదే ..ఇదే మాపచ్చని పశ్చిమ గోదావరి .


సాదరంగా ఆహ్వానించే మనస్తత్వం ,ఆప్యాయంగా పలకరించి ఆదరించే మంచితనం ,వచ్చినవారిని అన్ని రుచులతో మైమరపించే మంచితనం.. అందుకే గోదావరివాసులంటే అందరి లోను ప్రత్యేకత .


ఎందరో మహానుభావులు, తెలుగు సాహిత్య చరిత్రకు వన్నెతెచ్చిన చిలకమర్తి ,కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన దేవరకొండ బాలగంగాధరతిలక్ ,మన్యంవీరుడు అల్లూరిసీతారామరాజు ,గ్రందాలయోద్యమానికి బాటలు వేసిన ఎందరో మహానుబావులు ,స్వాతంత్రం కోసం ప్రాణాలొడ్డి,కారాగారాలకు వెళ్ళిన మరెందరో సమరయోదులు , సినీ పరిశ్రమలో మెగాస్టార్ , దర్సకరత్న దాసరి,కోడిరామకృష్ణ ,వంటి ఉద్దండులు,దర్సకులు,సాంకేతికనిపుణులు,సగర్వంగాచాటే చరిత్రకు సువర్ణాక్షరాలు వీళ్ళు. పశ్చిమావనికి ఇది ఎనబైమూడవ వసంతం .బౌగోళికంగా ,సామాజికంగా ,చారిత్రకంగా పశ్చిమావని ఇన్ని విజయలు సొంతం చెసుకొందంటే ఆ ఘనత ముమ్మటికీ మనది ,మనముందుతరాలవారిదే .