=''/>

30, సెప్టెంబర్ 2010, గురువారం

సరదాగా కాసేపు :):):)

ఏమిటండీ ....సరదాగా కాసేపు సినిమా గురించి అనుకున్నారా? నాకు సినిమాల రివ్యూలు రాసేంత టాలెంట్ లేదులేకానీ .....
మన "హాస్య బ్రహ్మ జంధ్యాల" గారి సినిమాలు చక్కగా కుటుంబ సభ్యులందరూ కుర్చుని హాయిగా చుసేలాగా ఉంటాయి.ఆయన సినిమాలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుంది . కొన్ని సన్నివేశాలు గుర్తొస్తే మనం అప్రయత్నంగా నవ్వుకుంటాము.అటువంటి హాస్య సన్నివేశాలను ఈ వీడియో ల్లో చూసి సరదాగా కాసేపు మనసారా .... హాయిగా నవ్వుకొండే.........:):) .





25, సెప్టెంబర్ 2010, శనివారం

ఓ వాలుజడా........

చాలా మంది తెలుగమ్మయిలు లానే నాకు వాలుజడ,పొడవు జడ అంటేచాలా ఇష్టం..

కానీ వాలుజడ కాకపోయినా దానిలో సగమైనా ఉందిలే(పదిసంవత్సరాల క్రితం వరకూ) పరవాలేదు అనుకునేదానిని. .ఇప్పుడు ఆ సగములో సగం కుడా లేకుండా పిలకైపోయింది :( .


రోడ్ మీద ఎవరైనా పొడవు జడమ్మాయి వెళుతుంటే ఆ అమ్మాయి వెళ్ళే వరకూ కళ్ళార్పకుండా ఆ జడ నే .......అలా చుస్తూ ఉండి పోతాను.(ఆ జడకు నా దిష్టి తగిలి పాపం తరువాత ఎలా అయిపోయేదో?) .. .పక్కన ఎవరైనా ఉండి పిలిస్తే సరే లేకపోతె ఆ అమ్మాయి వెళ్ళేవరకూ అంతే.... అంత పిచ్చనమాట జడంటే......


పొనీ మా పాప జడైనా........... పెద్ద జడ అవుతుందేమో అనుకున్నాను కానీ ,ఏదో ఓ మోస్తరు గా ఉంటుందంతే.... ఆ జడని కాస్తా హాస్టల్ లో జాయిన్ చేసినప్పుడు కత్తిరించేసాను.(ఆ కత్తిరించిన జుట్టుతో సవరం కట్టించేననుకోండి.తరువాత ఎలాగూ అవసరమవుతుందని .నాక్కాదండోయ్ తనకే ...... పెళ్ళిళ్ళకి ,ఫంక్షన్స్ కి లంగా ఓణి వేసుకుంటే ,పొడవుజడ...జడకుప్పెలూ ఉండాలికదా.. ). అసలే హాస్టల్లో ఉంటుంది నాలుగైదేళ్ళు పొతే ఇప్పుడున్న జడ కుడా ఉండదేమో .

సర్లే మా జడల గోడవెందుక్కానీ.........


మన దేశం లోనే(అదీ దక్షిణ భారత దేశం) పొడవు జడలు వేసుకునే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు అనుకుంటాం కదా........

ఇక్కడ చూడండి విదేశాలలో కుడా చక్కగా పొడవు జడ తో అమ్మాయిలు బలే ఉన్నారు .... అంతంత జడ లని వాళ్ళెలా మైంటైన్ చేస్తున్నారో.......


22, సెప్టెంబర్ 2010, బుధవారం

మా ఊరి గణేష్ నిమ్మజ్జన ఊరేగింపుకి ఈ సంవత్సరం స్పెషల్ ఎట్రాక్షన్

మా ఊరిలో ఈ సంవత్సరం గణపతి నిమజ్జనం ప్రతీ సంవత్సరం కంటే ఘనం గా చేయాలని శక్తి డాన్స్, మంటలతో విన్యాసాలు చేసేవారిని తీసుకొచ్చారు. మా ఊరికి వీళ్ళను తీసుకు రావడం ఇదే మొదటిసారి కావటంతో , మంటలతో వీళ్ళు చేసే సాహసాలను అందరూ ఉత్సాహగా చూసారు.

మీరుకూడా మా ఉళ్ళో జరిగిన ఈ దృశ్యాలను చూసి ఆనందిస్తారనుకుంటున్నాను.










20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా ఊళ్ళో గణపతి నిమజ్జనాని కై కన్నుల పండుగగా జరిగిన ఉరేగింపు దృశ్యాలు .

నిన్న మా ఊళ్ళో గణపతి నిమజ్జనోత్సవం చాలా బాగా జరిగింది.ఆదివారం కావడంతో .పిల్లలంతా కూడాఎంతో ఉత్సాహంతో ఈ సంబరంలో పాల్గొన్నారు .మేళ తాళాలతో ,విచిత్ర వేషదారుల విన్యాసాలతో వినాయకుని విగ్రహం ఉంచిన ట్రాక్టర్ వెళుతుంటే,.వినాయకుడు, సీతా రాములు,శివపార్వతులు,భాలరామ కృష్ణులు, దుర్యోధనుడు,బీముడు,షిరిడి సాయి,లవకుశులు,,నారదుడు,అల్లూరిసీతారామరాజు(,ఇంకా రెండో ,మూడో వేషాలున్నాయనుకుంటున్నాను......గుర్తులేదు.)వేషాలేసిన వారు ఉన్న ట్రాక్టర్లు కుడా అనుసరించాయి.


ఇంకో విషయమండోయ్ ..........వేషాలేసిన వారంతా మా ఊరే నండి. పైగా నేనంటే నేనని అందరూ పోటీ పడి మరీ వేసారండి. మా బాబు లవకుశుల లో ఒకటి వేస్తానని అన్నాడు కానీ జత సరిగ్గా కుదరక వద్దన్నారు. కొంచెం నిరుత్సాహ పడ్డాడనుకోండి .ఐనా నిన్న ఆదివారం కావడంతో తను అందరితోను ఏంతో ఉత్సాహంగా తిరిగేడు.ఉదయం పదకొండింటికి మొదలుపెడితే రాత్రి పది గంటలకు కానీ ఈ నిమజ్జనోత్సవం పూర్తవలేదు. ఎటువంటి ఆటంకం కలుగకుండా జయప్రదంగా నిమజ్జనోత్సవ ఉరేగింపు జరిగింది..







ట్రాక్టర్లు తో నిండిన వీది .


సీతా రామ లక్ష్మణులు .

అల్లూరి సీతారామరాజు .

శక్తి వేషం






14, సెప్టెంబర్ 2010, మంగళవారం

మా ఊరిలో గణపతి నవరాత్రులు.

హాయ్ !అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? బుజ్జి బొజ్జ గణపతికి ఉండ్రాళ్ళు ,కుడుముల నైవేద్యాలన్నీ బోజ్జనిండా పెట్టేరా?

మా ఊరి లోనూ జరుగుతున్న గణేశుని నవరాత్రి ముచ్చట్లూ చదవండి మరి..




మా ఊరిలో" వినాయక చవితి" సంబరాలు ఇంచుమించు పదిహేనేళ్ళ నుండి జరిపిస్తున్నారు..కానీ ఈ ఏడు మొదటి సారి నవరాత్రులు జరుపుతున్నారు. ప్రతీ సంవత్సరమూ లైబ్రెరీలోపెట్టి అక్కడే పూజ చేస్తారు.(లైబ్రెరీ లో వినాయకుడేంటి అనుకుంటున్నారా? మా ఊరి లైబ్రెరీ {ఆల్ ఇన్ } పోస్ట్ చదివితే తెలుస్తుంది)ఈ సారి మా గ్రామ కూడలి లో గణేశుని విగ్రహం నిలబెట్టారు. .ఇంకో విశేషమండి మా ఊరి గణపతికి పూజ మేమే చేసాము అనుకోకుండా ..ఉదయాన్నే ఇంటివద్ద పుజయ్యాక అక్కడ చేసాము.

ఈ సంవత్సరం మా ఊరి కుర్రాళ్ళు మంచి జోరుగా గణపతి ఉత్సవాలు జరిపించేస్తున్నారు.ఇక ఈ తొమ్మిది రోజులూ మైక్ ఫుల్ సౌండ్ లో పెట్టి మా చెవుల్లో తుప్పు వదిలించేస్తారు .చందాలు బాగా వసూలవడంతో ఆఖరి రోజు ఊరేగింపుకే ముప్పైఐదు వేలు ఖర్చు పెడుతున్నారు .(మా వారు కుర్రాళ్ళకు హెడ్ లాంటివారు కావడంతో ఇటువంటి విషయాలు నాకూ తెలుస్తాయనమాట).ఇంకా మ్యూజికల్ ఆర్కెష్ట్రా ,ఇలా ఒకటో రెండో ప్రోగ్రామ్స్ పెట్టారు .మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ చేయడానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావడానికి ఇష్టపడరెమో అనిపిస్తుంది .ఎందుకంటే ఊరు చిన్నది కావడంతో ఏ ప్రోగ్రాం జరిగినా చూడడానికి వచ్చేవాళ్ళు గట్టిగా లెక్కేస్తే వంద మందికి మించరు.మ్యూజికల్ ఆర్కెష్ట్రా లాంటివైతే మా పక్కఊళ్ళ నుండికూడా చూడడానికి వస్తారు .ఐనా ఎంతకంతే...జనం లేకుంటే వాళ్ళ కు హుషారు ఎక్కడుంటుందండీ....

తొమ్మిది రోజులూ పూజలందుకున్న మా వినాయకుడి నిమజ్జనానికి ఉరేగింపు చాలా బాగా జరుగుతుంది.ఉళ్ళో ఇంచుమించు అందరి ట్రాక్టర్లు ఊరేగింపులో పాల్గొంటాయి.ఉన్నవి నాలుగు వీధులైనా ఉదయం మొదలుపెట్టిన ఉరేగింపు సాయంత్రం ఐనా అవ్వదు.

మా గణేశుని ఉరేగింపు చిత్రాలు మీకూ చూపించడానికి ట్రై చేస్తానండి...తరువాత టపాలో .
.

6, సెప్టెంబర్ 2010, సోమవారం

నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టి అప్పుడే సంవత్సరం ఐపోయిందా?

మాది వ్యవసాయ ఉమ్మడి కుటుంబం .మా వారు బి.బి.ఎం.చదివారు కానీ , ఎరువుల కొట్టు ,వ్యవసాయం చూ స్తూ ఉంటారు.మా అమ్మగారిదీ ,అత్తయ్య గారిదీ కూడా మాఊరు గాంధీనగరమే (ఒకే వీధి . మేనత్తే ).నేనూ డిగ్రీ చదివాను. తీరిక సమయాలలో కుట్లు ,అల్లికలూ చేసుకునే సామాన్య గృహిణిని.పదేళ్ళ నుండి కంప్యుటర్ ఉన్నా లేని మార్పు నెట్ వలన ఈ సంవత్సరం కలిగింది . బ్లాగ్ ద్వారా మంచి స్నేహితులను అందించింది.

మా ఊరికి సంవత్సరం క్రితమే బ్రాడ్బాండ్ వచ్చింది .బ్రాడ్బాండ్ రాకముందూ నెట్ఉన్నా కానీ పాటలు ,ఫోటోలు డౌన్లోడ్ చేయడం,ఇలాంటి చిన్న చిన్నవి చేసేదానిని.మాకు బ్రాడ్బాండ్ రావటం , ఈ నాడు లొతెలుగు బ్లాగ్ల గురించి రావడం ఒకసారే జరిగింది. ఈ నాడు ఆదివారం పుస్తకంలో కూడలి గురించి తెలుగు బ్లాగ్ల గురించి చదివాక , రోజూ మన తెలుగు బ్లాగ్లు చదివేదానిని..అవన్నీ చదువుతుంటే ...అందరూ బలే రాసేస్తున్నారు అనిపించేది.నేను కుడా రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేదానిని .కానీ ఏదో మామూలు డిగ్రీ చదివి , పల్లెటూరి గృహిణినైన నేను రాస్తే ఎవరైనా చూస్తారా?లేక పొతే ,కంప్యుటర్ నాలెడ్జ్ పెద్దగా లేదు ,అవన్ని నాకెలా తెలుస్తాయి .. ఇలా అనుకునేదానిని.మా వారి తో అంటే ,తను చాలా ప్రోత్సాహించారు .

బ్లాగ్ రాయటం మొదలు పెట్టానుకాని కానీ ...మన బ్లాగ్ ఎవరు చుస్తారులే అనుకునేదానిని .అందుకే చాలా రోజులు హిట్ కౌంటర్,అనుచరులు గాడ్జెట్ ఇటువంటివేవి ఉండేవి కావు.కొత్తలో అలానే ఎవరూ పెద్దగా కామెంట్ లు కుడా రాసేవారు కాదు.చాలా నిరుత్సాహంగా ఉండేది :( .నేననుకున్నట్లే అయ్యిందా, లేకపోతే నేను ఇంకా బాగా రాయాలా అనుకునేదానిని.ఇప్పుడు పరవాలేదనుకుంటున్నాను.(నిజమేనా? మీరే చెప్పాలి.)

నిజమేనా ?నేనే బ్లాగ్ రాస్తున్నానా?అనిపిస్తుంటుంది అప్పుడప్పుడ్డు.. నేను బ్లాగ్ రాస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు కూడా .మా అక్కలకు,చెల్లికే తెలుసు .నా రాఖీ టపా గురించి పేపర్లో వచ్చినప్పుడు పేపర్ చూపించి చెప్పేను.ఆ టపాచూడని వారు http://saisatyapriya.blogspot.com/2010/08/blog-post_25.html ఇక్కడ చూడొచ్చు . .

ఎలాగో పడుతూ ...లేస్తూ ...బ్లాగ్ రాయడం మొదలుపెట్టి ఇప్పటికి సంవతత్సరం పూర్తి చేసాను. ఇంతకీ అసలు విషయమేమిటంటే ...నా బ్లాగ్ మొదలు పెట్టి ఏడాది అయిందని చూసుకోలేదు .పాత టపాలు చూస్తుంటే తెలిసింది.అప్పుడే నేను బ్లాగ్ మొదలపెట్టి సంవత్సరం ఐపోయిందా అనిపించింది..

ఈ మద్యే మా పిల్ల ల పుట్టిన రోజులు చేసుకున్నాము. మరి నా బ్లాగ్ నేస్తా లైన మీ అందరి ఆశిస్సులతో నా కొత్త నేస్తం నా బ్లాగ్ మొదటి పుట్టినరోజు కుడా చేసుకోవాలిగా.

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అనావృష్టి ,అతివృష్టి





నీరు పెట్ట లేక ఊడ్చిన వరిచేనుని అలా వదిలేసా రు. .




నిరుడు ఈ రోజులలో వర్షాలు సరిగా లేక వరి చేలకు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డారు .మాది మెట్ట ప్రాంతం అవటంతో ,మా వైపు ఎక్కువగా బోర్లు నుండి వచ్చే నీళ్ళ తోనే వ్యవసాయంచేస్తారు.వర్షాలు సకాలంలో పడకపోతే బోర్ నీళ్ళ తో ఎంతని వ్యవసాయం చేస్తారు .


ఈ ఏడు వానలు చాలా ఎక్కువగా పడుతున్నాయి .ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాల రాకతో మొదలైన ఎడతెరిపిలేని వర్షాలవలన అప్పుడే ఈ ఏడు సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనదంటున్నారు. సాదారణంగా అక్టోబర్,నవంబర్ నెలల మధ్యలో ఏర్పడే వాయుగుండా ల వలన గానీ,తుఫాన్ల వలన కానీ నదులు ,కాలువలు ,చెరువులు నిండి వరదలు అవీ వస్తూ ఉంటా యి కదా .మాకు ఈ వర్షాల వలన ఎర్రకాలువ(ఈ ఎర్రకాల్వ మా పొలం పక్క నుండి వెళుతుంది . ) నిండి చేలకు నష్టాన్ని కలిగిస్తాయి .రెండు సంవత్సరాల క్రితం ఐతే ఈ వరదలకు, కోతకు వచ్చిన వరిచేను వారం రోజులు నీట మునిగి పోయి పంట చేతికి రాకుండా పోయింది .అప్పుడు కాల్వకు గండి పడిరైతులకు బాగా నష్టం వచ్చింది . ఇది చెరువనుకున్తున్నారా?కాదు మా వరిచేనే .వరదనీటిలో మునిగి ఇలా చెరువు ను తలపిస్తుంది .


ఆ గండి ని పుడ్చక పోవటం వలన క్రిందటి నెలలో కురిసిన వానలకు వచ్చిన వరదకు మా చేను ఒక్క రోజు మునిగి పోయింది .మళ్ళీ పది, పదిహేను రోజులనుండి కురుస్తున్న వర్షాలకు ఎర్రకాల్వ లోకి బాగా వరద నీరు వచ్చి చేను మునిగి పోయి మూడు రోజులుంది.కానీనీళ్ళలో మునిగింది మూడు రోజులే కావడం, ఇంకా కంకులు వేయక పోవడంతో నష్ట మేమీ ఉండదంట.

వరద నీటికి ఎలా పడిపోయిందో చుడండి . ప్రస్తుతం చేలో నుండి వరద పోయింది .ఒక వారం పొతే నెమ్మిదిగా చేనంతా తేరుకుంటా దంట .( మందులు బాగా వేస్తారేమో )

అయినా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగానే పడతాయం టున్నారు .ఇంకా ఎన్ని సార్లు వరదలొస్తాయో ఏమిటో? రైతులకు ఏంటో ఎంత కష్ట పడుతున్నా ఎప్పుడూ అతివృష్టి ,అనావృష్టి ఏదో ఒకరూపంలో నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి . .