=''/>

29, డిసెంబర్ 2009, మంగళవారం

కోత యంత్రం తో వరి చేను కోతలు


మా వరిచేను కోతలు పూర్తయ్యాయి .గతరెండేళ్ల నుండి కోతమిషన్ సాయం తో వరిచేలు కోస్తున్నారు .
కూలీ ఖర్చు బాగా పెరిగిపోయి చాలా మంది మిషన్ తో కోయడానికే ఇష్టపడుతున్నారు . కూలీ లు పన్నెండు మంది

రోజుకి ఒక ఎకరం కోస్తే ,మిషన్ గంటలో ఎకరం కోస్తుంది .మళ్ళీ వాళ్ళను తీసుకురావడాము ,పంపడము చేయాలి .
మిషన్ వచ్చాక ఆ గొడవలేమి ఉండడములేదు .కోసేవాడు మిషన్ తో వచ్చి కోసేసి వెళుతున్నాడు .

ఇప్పుడు కూలీ రేట్లు కూడా బాగా పెరిగి పోయాయి . ఆడవాళ్లకు నూటయాబై ,మగవాళ్లకి రెండువందల
యాబై తీసుకొంటున్నారు .మిషన్ కి ఐతే ఎకరాని కోయడానికి ఈ సంవత్సరము తొమ్మిది వందలు తీసుకొన్నారు .నిరుడు కొత్త కావడం,మిషన్లు కూడ తక్కువ వుండముతో పదిహేను వందలు తీకున్నారు .ఎక్కువగా అవితమిళనాడునుండి వచ్చాయి .ఈ సంవత్సరము కొంతమది రైతులు కలసి మిషన్లు కొన్నారు అందుకే కొద్దిగా రేటు కూడా తగ్గింది .

మిషన్ వచ్చాక మావాళ్లకు మాత్రం చాలా హాయి గాఉంటుంది .వాళ్ళు ఎంతమంది వస్తారో ,ఎప్పుడు వస్తారు అన్న టెన్షన్ లు ఏవీ ఉండటము లేదు . రెండు రోజులలో నే కోతలు అయిపోతున్నాయి .

ఇలా అన్ని పనులకు మిషన్ లు వస్తే వ్యవసాయము చేయడము తేలిక అవుతుంది . ఖర్చులు కూడా తగ్గుతాయి .

1 కామెంట్‌:

  1. It is time to bring machines for all agricultural related purposes.
    Dealing with labour is a nightmare. These days you have to beg them litarally even after paying hefty amounts.
    They prefer to come at their wish, takes breakes and close the shop at the stroke of the watch, simply don't care whether they are doing any justice to the money.
    i heard they introduce machines to weave tobacco ?

    రిప్లయితొలగించండి