=''/>

23, సెప్టెంబర్ 2009, బుధవారం

తొమ్మిది రోజుల ఉత్సవాలు

ఆశ్వయుజ మాసం లో వచ్చే అమావాస్య తరువాతి రోజున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి .తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగల సంబరాలు చివరిరొజూ ,పదవరోజైనవిజయదసమిరోజునలేదా దసరా రోజున ముగుస్తాయి .
ఈతోమ్మిది రోజులూ అమ్మ రకరకాలుగా దర్సనమిస్తుందని

పెద్దల విశ్వాసం .మొదటిరోజు బాల, రెండోనాడు లలిత ,మూడోరోజు తరుణి, నాలుగోనాడు సుమంగళి ,ఐదవరోజు సతేక్షి ,ఆరోనాడు శ్రివిద్యారుపిని ,ఏడూ రోజు మహాదుర్గ ,ఎనిమిదో రోజు మహాలక్ష్మి ,తొమ్మిదోరోజు సరస్వతి ,పదవరొజున శివశక్తి ఐక్యరుపిని .
కొలువుగా బొమ్మలను తీర్చిన ప్రతి ఇంటిలోనూ ఈ తొమ్మిదిరోజులు, ఇళ్ళకు వచ్చిన అందరికీ తాంబూలం ,దక్షిణ ,నైవేద్యవస్తువులు తప్పకుండా ఇవ్వాలి .తోమ్మిదిరోజులుపూజలు చేయలేని వారు చివరి మూడు రోజులైన సప్తమి ,అష్టమి ,నవమి రోజులలోనైనా చేసుకుని ,విజయదసమి రోజున ముగించాలి ..చదువులతల్లి అయిన శ్రీసరస్వతీ పూజ రోజున పుస్తకాలు ,సంగీతవాయిద్యాలు ,పనిముట్లు పూజలో పెట్టాలి .మరునాడు విజయదసమి రోజున పుజతరువాత తీయాలి .ఆయా వృత్తులవారు తమ గురువులను పూజించి ,వారికి గురుదక్షిణలిచ్చి కోలుచుకోవాలి .వారి దీవెనలు అందుకోవాలి .క్రొత్తవృత్తుల ప్రారంభానికి విజయదసమి అత్యుత్తమమైనది .ఆరోజు రాత్రి బొమ్మలకు పాలనైవేద్యము సమర్పించి ,బొమ్మలను పడుకోబెట్టాలి .మరునాడు వాటిని తీసి ,మరుసటి సంవత్సరం దేవికి స్వాగతం చెప్పేందుకు సిద్దం కావాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి