=''/>

3, నవంబర్ 2009, మంగళవారం

అందినద్రాక్ష పుల్లన .


అదేంటి ,అందిన ద్రాక్ష పుల్లన అంటున్నాననుకొంటున్నారా ....... అసలుకదేమిటంటే..మా ప.గో.జిల్లాలో వారికి అసలుద్రాక్షపాదులు ఎలా ఉంటాయోతెలియదు.అటువంటిది ఈమధ్యన అందరూ కడియం నర్సరీ(మాకు కడియం నర్సరీ లు బాగా ఫేమస్) నుండి ద్రాక్ష పాదు లు తెచ్చి ఇళ్ల వద్ద పెంచుతున్నరు .అది చూసి మేము కూడా ఒకటి తెచ్చివేసాము .కొన్ని రోజులకి అది బాగాపెరిగింది .పూత కూడా బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా కాయడం మొదలుపెట్టింది .ఇక మేము అవి ఎప్పుడు పండుతాయా ,యెప్పుడు తిందామా అని యెదురు చూస్తూఉన్నాము. మేము ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది .చాలా ఆత్రంగా తయారైన గుత్తులన్నీ కోసేసేము .తీరా తిందామనినోట్లో పెడితే పుల్ల పుల్లగా వగరుగా ఉన్నాయి.అప్పుడు అనుకొన్నాము ,అందిన ద్రాక్ష కూడా పులుపేనని. . అప్పటి నుండి వాటిని యేమి చేయాలో తెలియక వాటితో పప్పు చారు కాస్తున్నము .నిజమండిబాబు. పచ్చి గుత్తులను కోసి కాయలను ఉడకబెట్టినీళ్ళు పిండి పప్పు లోవేసి ,ఉప్పు కారం వేసి ఉడికిస్తే ... ద్రాక్షకాయలతో పప్పుచారు రెడీ . . ఎలాఉందండి మాద్రాక్షకాయల పప్పుచారు.... .

1 కామెంట్‌: