=''/>

21, జూన్ 2010, సోమవారం

ఒక ప్రతేకత గల తరిణీమాత ఆలయం (ఒరిస్సా)


ఈ"తరిణీమాత" ఆలయం ఉత్తర ఒరిస్సాలోని ఘట్ గావ్ లో ఉంది .ఈఆలయం అంటే అక్కడి ప్రజలకు చాలా భక్తీ, నమ్మకము.

ఈ గుళ్ళో రోజూ ఇరవైవేల నుండి ముప్పైవేల కొబ్బరికాయలు కొడుతూ ఉంటారట .పండగలప్పుడు ,ప్రత్యేఖ పర్వదినాలకీ లక్ష ల కొబ్బరికాయలు కొడతారంట .
చాలా గుళ్లలో ఇలాగే జరుగుతుంది కదా అనుకుంటున్నారా.. అన్ని ఆలయాలలాగా కాదు ఈతరిణీమాత ఆలయం. ఈగుడి ప్రత్యేఖత ఏమీటంటే ఇక్కడి ప్రజలు వారి మొక్కులు తీర్చుకోవడానికివాళ్ళేవెళ్ళక్కర్లేదు.మొక్కుబట్టికొబ్బరికాయలు పంపిస్తారుఒక్కోసారి వాటితోపాటు ముడుపులుకూడా కడతారు .


ఘట్ గావ్ వెళ్ళే దారి పొడువునా ఎర్రగుడ్డ చుట్టిన కొబ్బరికాయలు,ముడుపులుకట్టుకొని నిలబడి అటువైపు వెళ్ళే బస్సులకు అందచేస్తారు .బస్సు డ్రైవర్లు కూడా అడుగడుగునా ఆగి అందరూ అందజెసే వాటిని జాగర్తగా తీసుకెళ్ళి అమ్మవారికి అందజేస్తారు. ఒక్కోసారి ఆకొబ్బరికాయలు పట్టుకుని మనుషులెవరూ నిలబడి ఉండరు ,ఐనా బస్సులు ఆపి ఎన్నికాయలుంటే అన్నింటినీ బస్సులో వేసుకుని సర్దు కుంటారు.ఒకవేళ బస్సు ఏదైనా అమ్మవారి ఆలయం ఉన్న ఘట్ గావ్ వరకూ వెళ్ళేది కాకపోతే ఆ దారిలో వెళ్ళే కూడలి దగ్గర దింపేసి వెళ్ళిపోతారు .అటువైపు ఘట్ గావ్ వెళ్ళే బస్సువాళ్ళు వాటిని ఎక్కించుకుంటారు .బస్సంతా నిండినా సరే డ్రవర్ సీటుకిందైనా ,ప్రక్కనా ఎక్కడైనా పెట్టుకుని తీసికెళతారంట. అలా ఆడ్రైవర్లు అందజేసినవాటిని ఆగుళ్ళో పూజారులు ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వంతులేసుకుని మరీ కొడతారంట .

ఎక్కడా మోసం లేదు ,దగాలేదు .కొబ్బరికాయ అమ్మవారిని చేరకపోయే ప్రశ్నే లేదు .బద్దకించో ,నిర్లక్ష్యం చేసో తీసుకెళ్ళకపోతే ఇంజన్ చెడిపోవడమో ,ఆక్సిడెంట్ అవడమో జరుగుతుందని డ్రవర్ల తో సహా అందరి నమ్మకమూను. అంతటి దృడ నమ్మకాలున్నప్పుడు తప్పులకూ ,పొరపాట్లకూ అవకాశం ఎక్కడుంటుంది.

ముంబైలో డబ్బావాలాలు ప్రతీ క్యారేజీనీ దాని యజమానికి జేర్చినట్లు ఉత్తర ఒరిస్సా లో ప్రతీ తరిణీమాత భక్తుడూ, భక్తురాలూ తలచుకోవాలేకానీ తాము కాలు కదపకుండా తమ నివేదననీ,ముడుపులనూ అమ్మవారికి సమర్పించగలరన్నమాట .

3 కామెంట్‌లు:

  1. మీరు చెప్పిన అమ్మవారి గుడి భలే విచిత్రంగా ఉంది. అమ్మవారి పేరు కూడా. భక్తి, నమ్మకం వారిని అలా నడిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. chala bagundi. ituvanti paddathi vijayawada durga gudi ki kooda aapadisthe chalabaguntundi.

    రిప్లయితొలగించండి