=''/>

9, అక్టోబర్ 2009, శుక్రవారం

పశ్చిమావని ...సిరులగని

ఎటుచూసినా పచ్చదనం ..పైటేసిన పడుచులా మాగాణి భూముల్లొ పైరుపచ్చని పంటలు ,గోదావరి పరవళ్ళు , ఉరకలు వేసే పంట కాల్వలు, అప్పుడప్పుడు,ఆగ్రహించినా ఎల్లప్పుడూ గోదారమ్మ చల్లని చూపులతో డెల్టా భూముల్లో పండే సిరులు ,పుష్కలమైన జలవనరులు ,వాణిజ్య పంటలతో కళకళలాడే మెట్ట పొలాలు ,అడవితల్లి ఒడిలో సేదదిరే గిరిజనం ,అటు సాగరతీరం ,ఇటు ఎత్తైన పాపికొండలు ,కనువిందు చేసే తుర్పుకనుమలు ,ఇదే ..ఇదే మాపచ్చని పశ్చిమ గోదావరి .


సాదరంగా ఆహ్వానించే మనస్తత్వం ,ఆప్యాయంగా పలకరించి ఆదరించే మంచితనం ,వచ్చినవారిని అన్ని రుచులతో మైమరపించే మంచితనం.. అందుకే గోదావరివాసులంటే అందరి లోను ప్రత్యేకత .


ఎందరో మహానుభావులు, తెలుగు సాహిత్య చరిత్రకు వన్నెతెచ్చిన చిలకమర్తి ,కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన దేవరకొండ బాలగంగాధరతిలక్ ,మన్యంవీరుడు అల్లూరిసీతారామరాజు ,గ్రందాలయోద్యమానికి బాటలు వేసిన ఎందరో మహానుబావులు ,స్వాతంత్రం కోసం ప్రాణాలొడ్డి,కారాగారాలకు వెళ్ళిన మరెందరో సమరయోదులు , సినీ పరిశ్రమలో మెగాస్టార్ , దర్సకరత్న దాసరి,కోడిరామకృష్ణ ,వంటి ఉద్దండులు,దర్సకులు,సాంకేతికనిపుణులు,సగర్వంగాచాటే చరిత్రకు సువర్ణాక్షరాలు వీళ్ళు. పశ్చిమావనికి ఇది ఎనబైమూడవ వసంతం .బౌగోళికంగా ,సామాజికంగా ,చారిత్రకంగా పశ్చిమావని ఇన్ని విజయలు సొంతం చెసుకొందంటే ఆ ఘనత ముమ్మటికీ మనది ,మనముందుతరాలవారిదే .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి