=''/>

29, ఆగస్టు 2010, ఆదివారం

నేడు మన మాతృభాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి 147 వ జయంతైన ఈ రోజు ని మనం " మాతృ భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము.

శిష్ఠ వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన చాలా కృషి చేసారు .

శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల పేటలో ఆయన 1863ఆగష్టు 29న వీర్రాజు ,వెంకమ్మ దంపతులకు జన్మించారు .

1896 లో బి.ఎ డిస్టింక్షన్ ఆయన చదువు పూర్తి చేసారు .గజపతి మహారాజా కాలెజీ లో అధ్యాపకుడిగా పనిచేశారు.తెలుగుభాషా బోధనను వ్యావహారికంలో చేయాలని ఆయన ఆలోచనకు జే.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయాదికారి నుండీ మద్దతు లభించింది .అప్పటి ఏవీ ఎన్ కాలెజీ ప్రదాన అధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్ ,గురజాడ అప్పారావు,యేట్స్ , రామప్ప పంతులు గారూ కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి కృషి చేసారు .వీరి కృషి కారణంగా 1912 -13 స్కూల్ ఫైనల్ తెలుగు పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసారు . అప్పటినుండి స్కూల్,కాలేజీ పాఠ్య పుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడటం మొదలుపెట్టాయి .ఆయన సేవలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము రావ్ బహుద్దూర్ బిరుదు ప్రదానం చేసింది .వ్యవహారిక భాషకు ఇంత సేవచేసిన ఆయన 1940 ,జనవరి 22వ తెదీ న మరణించారు .

మన తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని మనమంతా ఈ రోజు "తెలుగు భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము..

.



.

25, ఆగస్టు 2010, బుధవారం

నా రాఖీ టపా ఆంధ్రజ్యోతి నవ్య లో వచ్చిందోచ్ !!


మాకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది . రోజూ ఉదయం పేపర్ రావడంతోనే హెడ్లైన్స్ చూసి ,9 గంటలకి బాబు స్కూల్ కి వెళ్లాక టిఫిన్ చెస్తూ పేపర్ అంతా తీరుబడిగా చదువుతాను.



ఈ రోజు కూడా అలానే పేపర్ చదువుతూ నవ్య పేపర్ లో నా రాఖీ టపా చూసి ఆశ్చర్య పోయాను . చాలా ఆనందపడి పోయాను .వెంటనే అక్కలకి ,చెల్లికి ఫోన్ చేసి చెప్పేసేను.ఇంతకీ వాళ్ళందరికీ ఈనాడు పేపర్ వస్తుంది . ఆంద్రజ్యోతి పేపర్ కొనైనా సరే చదవండి అని వాళ్లకి చెప్పేను.

మరి నా మిత్రు లైన మీతో కుడాచెప్పి ,చూపించి ....... నా ఆనందాన్ని పంచుకోవాలికదా .అందుకే మీ అందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈ టపా.

24, ఆగస్టు 2010, మంగళవారం

బ్లాగ్ సొదరీ,సోదరులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు




ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు .

కానీ ,నాకు చిన్నప్పుడు రాఖీ పండుగ వస్తే కొంచెం విచారం గా ఉండేది .ఎందుకంటే మేము నలుగురుమూ అమ్మాయిలమే . అందరూ చక్కగా వాళ్ళన్నయ లకు,తమ్మూలకూ ఎలా రాఖీ కట్టేము, అన్నయ్య ఏమి గిఫ్ట్ ఇచ్చాడు ,ఇలా అన్నీ చెబుతూ ఉంటే ,నాకూ ఒక "అన్న "కానీ "తమ్ము" కానీ ఉంటే చక్కగా నేనూ రాఖీ కట్టేదాన్నికదా అనుకునేదాన్ని.అందులోనూ నాకు తమ్ముడంటే ఇంకా ఇష్టం . చక్కగా అక్కా ,అక్కా అంటూ తిరుగుతారు అని ,ఇంకా ఏవో చాలా అనుకునేదానిని . ఇప్పుడూ కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది .ఆ ఫీలింగ్ గుర్తు చేస్తూ రాఖీ పండుగ వచ్చేసింది .

అన్నలున్న చెల్లాయిలకు, తమ్ముళ్ళు న్న అక్కయ్యలకు .........

"రాఖీ శుభాకాంక్షలు "

బ్లాగ్ లోకపు అన్నలకూ ,తమ్ముళ్లకూ నా "రాఖీ శుభాకాంక్షలు ."

14, ఆగస్టు 2010, శనివారం

స్వాతంత్ర్య శుభాకాంక్షలు



బ్లాగ్ మిత్రులు అందరికీ

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

10, ఆగస్టు 2010, మంగళవారం

నేను వేసిన పైంట్లు ,నేను తయారుచేసినవి .




ఇది శెకుంతల గ్లాస్ పైన్టింగ్ .

ఇది "నిబ్ పైన్టింగ్" .లైన్స్ నిబ్,రౌండ్ నిబ్ అని ఉంటాయి .వాటితో వేస్తారు.ఆయిల్ పైంట్ తోనే వేస్తారు .
ఇవి నా డిగ్రీ అయ్యాక రాజమండ్రిలో నేర్చుకున్న పైన్టింగ్స్.

కింద వన్నీ నేను సొంతం గా తయారు చేసినవి.
ఇది ,సోలార్ వుడ్ అని ఒక మెటీరియల్ ఉంటుంది. దానిని ఇలా వివిధ షేప్ లలో కత్తిరించి ,అంటించి తయారు చేసిన నెమలి ..

ఇది దర్మోకాల్ తో చేసిన జపాను అమ్మాయి.ధర్మో కాల్ పైన డిజైన్ గీసుకుని ,కట్ చేసి పైన ముకమల్ క్లాత్ అంటించి ,చిప్స్ ఇంకా మనకు ఎలా కావాలంటే అలా అంటించుకో వచ్చు.
పాత చాకు ను వేడి చేసి ,కట్ చేస్తే దర్మోకాల్ చాలా తేలికగా కట్ అవుతుంది .


ఇది పాట్ పైంట్ .ఫెవికాల్ లో చాక్ పౌడర్ కలిపి ఇలా తీగలు గా చేసి పాట్ కు అంటించి కలర్స్ వేసేను.


దీనికి చాలా చాలా రకాలు అంటించాను.డైమండ్ షేపులో అంటించినవి చిన్న చిన్న నత్త గుల్లలు .పచ్చ,ఎరుపు రంగు లు ,మెత్తని ఇసుకలో కలిపి ఆరాక అంటించాను .పైన రౌండ్ షేపులకి,బియ్యం రంగులో కలిపి వేసాను. ఇంకా అద్దాలు ,గురువింద గింజలు అంటించాను .అక్కడక్కడా ఊడిపోయాయి.ఇవి చేసి పన్నెండేల్లు అవుతుంది.అందుకే కొంచెం డల్ గా ఉన్నాయి . .
ఇంకా చాలా చేసాను కానీ అవన్నీ పాడైపోయాయని పెట్టలేదు .బియ్యానికి కలర్స్ వేసి స్వాగతం అనిరాసి ఒకటిచేసాను .బాగుండేది కానీ కిందపడి పడి పోయి పోయింది .

4, ఆగస్టు 2010, బుధవారం

ఇది ఏమి పువ్వు?





"కదంబ పుష్పం" అండి ఇది .సరస్వతీ దేవికి ఎంతో ఇష్ట మైన పువ్వు..

నేను ఈ రోజే మొదటిసారి చూసాను. కదంబపువ్వు పేరు విన్నానుకానీ ,ఎప్పుడు చూడలేదు .చాలా బాగుంది .చాలా మంచి సువాసన నిస్తుంది .నాకెంత నచ్చేసిందంటే వెంటనే మొక్క తెచ్చి వేసేయాలనిపించింది.ఎక్కువగా అమ్మవారి గుళ్ళ వద్ద వేస్తారు.

ఈ మద్య మా ఉళ్ళో ఇద్దరిళ్ళ వద్ద వేశారన్నారు.వాళ్ళింటి వద్ద పూసిందంటే చూద్దామని తెప్పించాము.పనిలో పని మీకు కుడా చూపిస్తున్నాను.ఎలా ఉందండి ఈ" కదంబ పుష్పం"
?

30, జులై 2010, శుక్రవారం

మా ఇంట్లో ఈ రోజు ఇద్దరి పుట్టినరోజు .


ఈ రోజు మా" సాయి" (మా అబ్బాయి )తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకుని"పదో సంవత్సర ము "లోకి అడుగుపెడుతున్నాడు .

పిల్లలు ఎంత తొందరగా ఎదిగి పోతారో .అప్పుడే వాడికి పదేళ్లు వచ్చేసాయా అన్పిస్తుంది.

వాడి అల్లరి చేష్టలు,చిలిపి పనులు ,చిన్నప్పటి సంఘటనలు ముద్దు ముద్దు కబుర్లు ,అక్క తో వాడి పోట్లాటలు చాలా గుర్తున్నాయి కానీ ,

ఇంకా చాలా తీపి జ్ఞాపకాలను కాలగమనం లో మర్చిపోయి ఉంటాను . పిల్లల చిన్నప్పటి విషయాలు ఎప్పటికప్పుడు డైరి లోరాసి వుండవలిసింది అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ..

సాయి చిన్నప్పుడు (ఎల్.కే. జీ.లో ఉండగా )అందరమూ డాక్టర్లు గురించి మాట్లాడుకుంటుంటే వాడు నేను డాక్టర్ నై మన ఉళ్ళో హాస్పటల్
కట్టి తాతగారు వాళ్లందరినీ బాగా చూస్తాను అన్నాడు. మా నాన్న గారు,మావయ్యగారు వాళ్ళు సంబరపడిపోయారు వాడి మాటలకి.
ఎందుకంటే మాది పల్లెటురుకదా డాక్టర్లు అందుబాటులో ఉండరు ,వచ్చిన రోగం ఎంతచిన్నదైనా పట్నానికి పోవలసిందే . .

అలాగే తనకి పాటలంటే బాగా ఇష్టం .బాగా వింటాడు .ఇప్పటి పాటలే కాదు ,ఇళయరాజా వి ,ఇంకాపాతవి కుడా ఇష్టం. అప్పుడప్పుడూనేను పెద్దైయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అంటుంటాడు.అలా అంటే మేము సరదాగా "డాక్టర్ సాయి మ్యూజిక్ డైరెక్టర్ "అని పిలుస్తుంటాము.

తను ఈ పుట్టినరోజు కోసం ఇంచు మించు కొత్త కేలండర్ కొన్నప్పటి నుండి అంటే జనవరి నుండి ఎదురు చూస్తున్నాడు (ప్రతీ సంవత్సరమూ అంతే అనుకోండి)
.ప్రతీ నెలా ౩౦ తారీకు వస్తే వచ్చేస్తుంది జూలై నెల అనేవాడు. ,జులై నెల వచ్చేక కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు.

ఇదిగో తను ఇంతో ఎదురు చూసిన "జులై ౩౦ " వచ్చేసిందిగా .

"సాయి"నువ్వెంత గానో ఎదురుచూసిన నీ పుట్టినరోజు వచ్చేసింది నాన్న . ఇటువంటి "పుట్టినరోజు "లు జీవితాంతం ఆనందంగా జరుపుకోవాలని
మేమంతా మనసారా ఆశీర్వదిస్తున్నాము .


ఇంతకీ రెండో పుట్టినరోజు ఎవరిదో చెప్పలేదు కదా. ఏ విషయములో నైనా నన్ను ఎంతగానో ప్రోత్సాహించే ది మావారు తనది కుడా ఈ రోజే పుట్టిన రోజు .


సాయి నీకు ,నాన్న కి ఇద్దరికీ
######### ##పుట్టినరోజు శుభాకాంక్షలు"#############

14, జులై 2010, బుధవారం

తొలకరి


మేఘాలను గాలి
జల్లెడ పడుతుంది!
చినుకులు చినుకులుగా...

పల్లెతోట లో మట్టి పుష్పం
పరిమళాలు పంచుతుంది!
తొలకరి జల్లులకు తడిసి.

కొమ్మలు వంచి చెట్టు
ఉగుతుంది!
పక్షిపాటలో లీనమైనట్టు.

ఈ చిరుకవిత ఒక పుస్తకం లో చదివినది .మీ అందరి కోసం .

10, జులై 2010, శనివారం

నా హాస్టల్ జీవితం


నేను ఇంటర్ ,డిగ్రి మొత్తం ఐదేళ్ళు రాజమండ్రిలో ఎస్ .కే .ఆర్ ఉమెన్స్ కాలేజీ లో చదివాను. ఆ ఐదేళ్లు హాస్టల్ లో నే ఉన్నాను. మా అక్కలిద్దరూ అక్కడే చదువుతుండడంతో నన్నూ అక్కడే జేర్చారు.


హాస్టల్ అంటే చక్కగా బోల్డు మందిని ఫ్రెండ్స్ చేసుకొవచ్చు ,హాయిగా మనిష్టమొచ్చినట్టుండొచ్చు..అక్కలుంటారు అనీ రకరకాలుగా ఊహించుకొని మాంచి ఆనందంగా వెళ్ళిపోయాను.వెళ్ళి రెండురోజులుండేటప్పటికి తెలిసింది .హాస్టల్ ఉంటే ఎలాగుంటుందో .......


"హాస్టల్ జీవితం "ఎలాఉంటుందో..అన్దరికీ తెలిసిందే .బోజనానికి క్యు లో వెళ్లడం ,బాత్రూమ్ కోసం వైట్ చేయడం...చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి కానీ, అవన్నీ ఎందుకులెండి .


పిచ్చి పిచ్చి రూల్స్ ఉండేవి. సంధ్య అని ఒక మాట్రిన్ ఉండేది. ఆవిడ తన అరుపులతో ,బెదిరింపులతోనూ అందరికీ ఇరిటేషన్ తెప్పించేసేది.పాపం తన అరుపులకు అందరూ జడుస్తారనుకునేది .వార్డెన్ గా కాలేజీ లెక్చరర్ ఒకావిడ ఉండేది .ఆవిడ విజిట్ కి రాగానే ఈవిడరిపోర్ట్లు ఇచ్చేసేది . కాసేపు అవిడ క్లాసులుపీకేది .అవిడ అలా వెళ్ళగానే అందరమూ దులుపుకుని వెళ్ళిపొయేవాళ్ళము.


నేను ఎక్కువగా అక్కలతోనూ, వాళ్ళ ఫ్రెండ్స్ తోనూ ఉండడం తో మనమూ తొందరగానే "రూల్ అన్ని ఎలా బ్రేక్ చేయాలో నేర్చేసుకున్నాము" . (ఐనా ఇటువంటివి తొందరగా నేర్చేసుకుంటాము కదా) వాళ్ళెప్పుడైనా ఏదోవంక పెట్టి బయటకెళ్ళినా, సినిమాకెళ్ళినా నేనుకూడా వాళ్ళను
హచ్ కుక్క పిల్లలా ఫాలో అయిపొయేదాన్ని . అలా అలా.. వాళ్ళే నాక్కూడా ఫ్రెండ్స్ ఐపొయారు. .త్రోబాల్ ఆడినా ,షటిల్ అడినా వాళ్ళతోనే అడేదాన్ని. నాకు త్రొబాల్లో ఒక సర్టిఫికెట్ కూడా వచ్చింది .దానిని ఇప్పటికీ బద్రంగా దాచుకున్నాను .


మా హాస్టల్ కి ఆదివారాలు జామకాయలబ్బాయి వచ్చేవాడు అమ్ముకోవడానికి.వాడి వద్దకు"
ఒక రూపాయి" తీసుకుని అందరమూ వెళ్ళేవారము. వాడి చుట్టూ చేరి .. మాటల్లో పెట్టి ,రెండుకొని నాలుగు కొట్టేసేవాళ్ళము. కొట్టేసిన జామ కాయలు తింటే అప్పట్లో అదో తుత్తి.. ఇప్పుడనిపిస్తుంది ..వాడు ఎంత కష్టపడి ఆజామ కాయలు తెచ్చి అమ్మేవాడో ,అలా తన కష్టంతో ఎంతమందిని పొషించేవాడో కదా ....అలా కొట్టేసే వాళ్ళమేంటి అని.


మా హాస్టల్ కి వాచ్ మెన్ గా ఒక తాత ఉండేవాడు .అతనిని మంచి చేసుకుని చాలా మంది బయట లైబ్రేరీనుండి నవలలు తెప్పించేవారు.. అలా తెప్పించిన వాళ్ళదగ్గర తీసుకొని నవలలు చదివేదానిని.ఎక్కువగా ఆర్.సంధ్యాదేవి,యద్దనపూడి నవలలూ తెచ్చే వాడు. అతను ఏవితెస్తే అవి ప్రాప్తమనమాట. ఇలా .. డిగ్రీ ఫైనల్ వరకూ చక్కగా వాళ్ళంతా నాకు జతగా ఉండడంతో ఎంజోయ్ చేస్తూ గడిపే సాననమాట.


నేను డిగ్రీ ఫైనలియర్ కొచ్చే టప్పటికి అక్కలు, వాళ్ళ ఫ్రెండ్స్ (నాకూ వాళ్ళే కదా ఫ్రెండ్స్ ) చదువైపోవడంతో వెళ్ళిపోయారు. నేను వాళ్ళంతా ఉండడం తో మాక్లాస్మేట్స్ తో పెద్దగా ఫ్రెంఢిప్ చేయలేదు. వాళ్ళంతా వెళ్ళిపోవడం తో ఫైనలియర్ డల్ గానే గడిచింది . ఫైనలియర్ కదా,ఫ్రెండ్స్ ఎక్కువగా లేక పోవడంతో కొంచెం ఒళ్ళొంచి చదివి డిగ్రీ పూర్తి చేసేసాను..


మా ఫ్రెండ్స్ లో ఇద్దరు రాజమండ్రిలోనే ఉంటున్నారు.అప్పుడప్పుడూ కలుస్తూంటాము. ఈ మద్యనే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఆబ్బాయి పంచి కట్ల ఫంక్షన్ జరిగితే మేము వెళ్ళాము.


ఒకరిద్దరు మిస్సయ్యారుకానీ అంతా వచ్చారు. కాసేపు అలా...అలా...రింగులు తిప్పుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాము. ఎలా టైం గడిచిందో కుడా తెలియలేదు.


ఇంతకీ హాస్టల్ నుండి వచ్చేసాక మళ్ళీ ఇప్పటివరకూ అక్కడికి వెళ్ళలేదు. అస్తమానూ రాజమండ్రి వెళుతూనే వుంటాను.ఈసారి ఎలాగైనా వీలు చూసుకుని వెళ్ళి ,అంతాతిరిగి కాసేపు ఆ మదుర ఆజ్జాపకాలన్నింటినీ తలుచుకొని ఆనందించాలి.

7, జులై 2010, బుధవారం

మా తోటలోని పలురకాలమొక్కలు.

తిరిగి నిన్నటి పోస్టేమిటి అని వెళ్ళిపోకండి. నిన్న నాకొచ్చిన వాఖ్యలన్నీ మాయపోయాయని..ఏమి చేలో తెలియక, కామెంట్స్ మాయం:( :( ఐపోయాయన్న ఆత్రుతతో తొలిగించి ఈరోజు మళ్ళీ పోస్ట్ చేసాను. .అన్యదా బావించకండి .నాకు నిన్న కామెంట్స్ రాసిన వారందరికీ దన్యవాదాలు.మీకిష్టమైతే ఈరోజు కూడా మీవాఖ్య రాయండి ఓపికగా.

పునాస వేసి పది సంవత్సరాలవుతుంది. సంవత్సరానికి రెండు కాపులిస్తుంది.కాయలు కాసినప్పుడల్లా కొద్దిగా ఆవకాయ పెడుతూఉంటాము.పప్పులోకి,పులుసులోకి అన్నింటికీ వాడుతూ ఉంటాము.ఇంటిదగ్గర ఉండటముతో మాఇష్టం అనమాట. అన్ని రకాలుగానూ వాడుతూ ఉంటాము. పులిహార, పప్పుకూరలకి(ఏ పప్పుకూరైనా సరే),పులుసులకి,పచ్చళ్ళలోకి, పులుపు కోసం చింతపండు వేయకుండా ఒక మామిడికాయ వేస్తాము. రుచి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి.


ద్రాక్ష పాదుని కడియం నర్సరీలనుండి మొక్కలు తెచ్చి అమ్ముతూంటారువాళ్లవద్దతీసుకునివేసాము. వేసి మూడేళ్లైంది. బాగా కాస్తుంది కానీ కొంచెం పుల్లగా ఉంటాయి. ఎలాగూ పుల్లగాఉంటున్నాయని,అప్పుడప్పుడూ పప్పుచారు కాస్తూంటాము.

బత్తాయిలు బుట్లో దాగున్నాయి. బత్తాకాయలకు మంచిరంగు వచ్చి,దొమపోటు తగలకుండాఉంటాయని ఇలా బుట్టలు కడతారు.



ఈ జామ మొక్క పెద్ద గా పెరగదు కానీ కాయలు పెద్దగా కాస్తాయి .అందుకే దీన్ని కెజీ జామ అంటారు .గింజలు ఎక్కువగాలేకుండా కాయ తినడానికి రుచిగా ఉంటుంది. .



ఇది అంజూర్ మొక్క. ఈ పళ్ళు రక్తసుద్దకి పని చేస్తాయి .ఈగింజలనే ఎండబెట్టి స్వీట్స్ లో వేస్తారు.చిన్నగా గసగసాలు లా ఉంటాయి.ఐదేళ్లైంది వేసి.పువ్వులు ఉండవు.ఆకుల దగ్గరే కాయలు వచ్చేస్తాయి.



శ్రీ గంధం మొక్క .ఈమొక్కవేసి పదమూడేళ్ళైంది. ఇది పారాసైట్ మొక్క .మొక్కలు గింజపడితే లెగుస్తాయికానీ,అది కొంచెం పెరిగే వరకూ పక్కన ఏదోఒక మొక్క సపోర్టు ఉండాలి .కంది మొక్క కు వేరు బాగుంటుందని కందిగింజలు పక్కనవేస్తారు. . అసలు గంధం వాసనేరాదు. మొక్క ముదిరి పూర్తిగా తయారవుతేనే వస్తుందంటున్నారు.


ఇది దాల్చిన చెక్క మొక్క.దీని ఆకులే పలావాకులు.ఐదేళ్లైంది వేసి.