=''/>

16, డిసెంబర్ 2009, బుధవారం

ఒవెన్ లేకుండానే బిస్కట్లు చేయడం .

*బిస్కట్లు చేయడానికి కావలసిన పదార్ధాలు .
మైదా పిండి -అరకేజీ
పంచదార -పావుకేజీ ,పొడి చేసుకోవాలి.
నెయ్యి -రెండు వందల గ్రాములు .
యాలికల పొడి కొద్దిగా
వంట సోడా -ఒక స్పూన్.
తయారు చేయు విదానం ***

ఒక పెద్ద ప్లేట్ లో మైదా పిండి ,పంచదార పొడి ,నెయ్యి ,సోడా ,యాలిక పొడి వేసి బాగా కలుపుకోవాలి .దీన్ని బాగా కలుపుకొంటే నెయ్యి పైకి తేలుతుంది .ఇప్పుడు చపాతీలు చేసుకొనే పీట మీద ఈ పిండిని వేసి చేతితో పీట అంతాసమానము గా పరుచుకొని చేతితో వత్తాలి .ఇప్పుడు మనకు కావలసిన సైజు లో గుండ్రము గా కాని ,అర్ధ చంద్రాకారము లో కాని కోసుకోవాలి .(చిన్న డబ్బాముతా ను కోయడానికి ఉపయోగించవచ్చు .)
ఇప్పుడు పాత పెనముకాని ,కుక్కరు పాన్ కాని తీసుకోని దానిలో కొద్దిగా ఇసుక వేసుకోవాలి .
దానిని స్టౌ మీద పెట్టి వేడి గా అయ్యాక దానిమీద కోసుకొన్న బిస్కట్లను ఒక సేమంది ప్లేటు లోకాని (స్టీలు ప్లేట్ ఐతే అడుగున అంటుకు పోయి సరిగారావు ),కేకు చేసుకొనే గిన్నెలో కాని అడుగున నెయ్యి రాసి వాటిని జాగర్తగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి .చిన్న మంట మీద వేగనివ్వాలి .అడుగున కొద్ది గా ఎరుపు రంగు వస్తే వేగి పోయినట్టే .

2 కామెంట్‌లు: