=''/>

14, నవంబర్ 2009, శనివారం

మేము ...మా వనభోజనాలు .


మేము గత మూడేళ్ళ నుండి ప్రతి సంవత్సరము వనభోజనాలు ఎవరో ఒకరిపోలములో పెట్టు కొంటున్నాము .ఇప్పుడు మా కొబ్బరితోటలోపెట్టుకొన్నాము .అంతా కలసి ఓయాభైమందయ్యాము .

మేము (అంటే నేను , రజనిఅని నాకజిన్ ,మాకు అత్తగారు అవుతుంది ( కానీచిన్నదే )రత్నం అని తను ,)ముగ్గురమే అన్నీ చూసుకొన్నాము. ముందు రోజు రాత్రిపనస పొట్టుకూర ,కొత్తిమీర పచ్చిచింతకాయపచ్చడి చేసేసుకొన్నాము.( పనసపొట్టుకూర మరునాడుకి వూరి బాగుంటుంది.).అలాగే మిగతా కూరగాయలు అన్నీసిద్దము చేసుకొన్నాము.


ప్రొద్దుటే వంటమనిషి ,నలుగురు సాయం చేసేవారు వెళ్లి ,మేము అందరమూ వెళ్ళే టప్పటికి వంటకానిచ్చేసారు. ఆరోజు మా మెనూలో ఇంకా యేమిటంటే ...దొండకాయ వేపుడు , కాలీఫ్లవర్ చిక్కుడు ,గుమ్మడికాయదప్పలము, పప్పు ,వుసిరికాయ పచ్చడి .స్వీట్ పాలతాలికలు ,హాట్ పచ్చిమిరపకాయ బజ్జి .

ఇక,మాకు పనేమి లేదు .మేము వెళ్లిన వారిని పెద్దవాళ్ళు ,పిల్లలుగా విడదీసి వారినందరినీ ,మ్యూజికల్ చైర్స్ ,స్పూన్లో నిమ్మకాయ ఆటలు ఆడించాము (మేము కూడా ఆడాము అనుకొండి.) .పెద్దవాళ్ళు అలవాటులేక మేము ఆడము అన్నారు కానీ ఎలాగో ఆడించేసాము .

మేము అందరమూ ఆడవాళ్లమే వెళ్లాము .కావాలనే వెళ్ళాము.మగవాళ్ళు వుంటే సరిగా ఆటలుఆడరు,సిగ్గుపదతారని.. కడుపులో ఎలుకలు పరిగెట్టేవరకూ అలా ఆడుతూనే వున్నాము. కాసేపటికి అందరికి సిగ్గు ,బిడియమూపోయి లైన్లో పడ్డారు. తరువాత కబాడీ ,కో కో ఇలామాయిష్టమొచ్చిన ఆటలన్నీ... అలసిపోయేవరకూ ఆడుతూనే వున్నాము. టైము కూడాతెలియలేదు .అసలే సీతాకాలము కదా ,ఐదున్నరకే చీకటిపడిపోయింది.అందరమూ చాలాబాగా గడిపాము. అందరూ... అప్పుడే వెళ్ళిపోదామా ,ఇంకా కాసేపు ఉందాము అని అంటే అలా అలా ఆరింటివరకూ ఉండిపోయేము .

ఇలా ఆటపాటలతో , ఒక్కకార్తీక వనబోజనా లప్పుడే ఎందుకు గడపాలి ,నెలకో రెండునెలలకో పెట్టుకోవచ్చుకదా అనిపించింది. పెద్దవాళ్ళు ఎప్పుడూ ఏదోఒక పని తో బిజీ గావుంటారు .ఇలాపెట్టుకొంటే వాళ్ళకి కాస్త సరదాగా ఆట విడుపుగా ఉంటుందికాదా ...

ఇవండి మరి మా వనభోజనాల విశేషాలు..

బుల్లిపిట్ట ..బుజ్జిపిట్ట ...




4, నవంబర్ 2009, బుధవారం

పంటినొప్పికి ఇంటిమందు .

పిప్పిపళ్ళ వలన కానీ చిగుళ్ళలో ఇన్ ఫెక్షన్ వలనగానీ ఒక్కొక్కసారి పంటినొప్పి ఎక్కువగా వస్తుంది. అటువంటప్పుడువెంటనే వైద్యుడివద్దకు వెళ్ళటం కుదరకపోతే ఇంటిలో ఉన్న వాటితోనే కొన్ని చిట్కా మందులు చేసుకొని వాడవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఉల్లిపాయముక్కను కోసి పెట్టవచ్చు . ఐసుముక్కను గుడ్డలో పెట్టి నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతుంది . లవంగనూనె,వెల్లుల్లి కూడా వాడవచ్చు .ఉప్పునీటిని పుక్కిలించి ఊసినా మేలు కలుగుతుంది .వెనిల్లా ఒకటి రెండు చుక్కలు నెప్పిగా ఉన్నచోట వేయవచ్చు .ఇంకా చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా నమిలినా బాధ కొద్దిగా తగ్గుతుంది . ఇంగువలో నిమ్మరసం కలిపి దానిలో ముంచిన
దూదిని పంటిపైన పెట్టుకుంటేకూడా నొప్పితగ్గుతుంది.

3, నవంబర్ 2009, మంగళవారం

అందినద్రాక్ష పుల్లన .


అదేంటి ,అందిన ద్రాక్ష పుల్లన అంటున్నాననుకొంటున్నారా ....... అసలుకదేమిటంటే..మా ప.గో.జిల్లాలో వారికి అసలుద్రాక్షపాదులు ఎలా ఉంటాయోతెలియదు.అటువంటిది ఈమధ్యన అందరూ కడియం నర్సరీ(మాకు కడియం నర్సరీ లు బాగా ఫేమస్) నుండి ద్రాక్ష పాదు లు తెచ్చి ఇళ్ల వద్ద పెంచుతున్నరు .అది చూసి మేము కూడా ఒకటి తెచ్చివేసాము .కొన్ని రోజులకి అది బాగాపెరిగింది .పూత కూడా బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా కాయడం మొదలుపెట్టింది .ఇక మేము అవి ఎప్పుడు పండుతాయా ,యెప్పుడు తిందామా అని యెదురు చూస్తూఉన్నాము. మేము ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది .చాలా ఆత్రంగా తయారైన గుత్తులన్నీ కోసేసేము .తీరా తిందామనినోట్లో పెడితే పుల్ల పుల్లగా వగరుగా ఉన్నాయి.అప్పుడు అనుకొన్నాము ,అందిన ద్రాక్ష కూడా పులుపేనని. . అప్పటి నుండి వాటిని యేమి చేయాలో తెలియక వాటితో పప్పు చారు కాస్తున్నము .నిజమండిబాబు. పచ్చి గుత్తులను కోసి కాయలను ఉడకబెట్టినీళ్ళు పిండి పప్పు లోవేసి ,ఉప్పు కారం వేసి ఉడికిస్తే ... ద్రాక్షకాయలతో పప్పుచారు రెడీ . . ఎలాఉందండి మాద్రాక్షకాయల పప్పుచారు.... .

2, నవంబర్ 2009, సోమవారం

బ్లాగ్ వనంలో వనభోజనాలు -గుమ్మడికాయ దప్పళం .

మా వైపు ఫంక్షన్లలో ఎక్కువగా గుమ్మడికాయ దప్పళం వండుతారు.
దీనికీ కావలసిన పదార్దాలు ...
గుమ్మడికాయ -చిన్నది ఒకటి .
ఉల్లిపాయలు -రెండు .
పచ్చిమిర్చి -ఆరు
బెండకాయలు -పది .
టమాటాలు -మూడు .
ములక్కాడ -ఒకటి .
వంకాయలు -రెండు .
కొత్తిమీర-ఒకకట్ట .
పోపు పెట్టుకోవడానికి ..
మెంతులు -అర స్పూను
ఆవాలు -అరస్పూను
జీలకర్ర -అరస్పూను

ఎండుమిరపకాయలు-నాలుగు.కరివేపాకుకొద్దిగా .
చింతపండు కొద్దిగా .
బెల్లం కొద్దిగా .
తయారుచేసేవిదానం .....
..
స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించి దానిలో నీరు పోసి,గుమ్మడికాముక్కలువేయాలి .అవి ఉడుకుతుండగా , ముక్కలుగాకోసుకొన్న కూరగాయముక్కలు దానిలోవేయాలి. ఉల్లిపాయలను చీరికలుగా కోసుకోవాలి.అవి, పచ్చిమిర్చి ముక్కలులుకూడా వేసుకోవాలి .కొద్దిగా వుడికాక ,కారము ,ఉప్పు ,పసుపు వేసుకొని,చింతపండుపులుసు ,బెల్లముకొద్దివేసుకోవాలి.కాసేపు ఉడికేక స్టవ్ కట్టేసుకొని తాలింపు పెట్టుకొని ,కొత్తిమీర జల్లుకోవాలి .

దీనిని ముద్దపప్పులొకలుపుకొని తింటే ఉంటుందీ ..........

పపపపప్పు ..దప్పళం ......వేడి వేడి అన్నం మీద....కమ్మనిపప్పు కాచిన నెయ్యి ...కలిపితే ..భొజనం వనభొజనం ......

30, అక్టోబర్ 2009, శుక్రవారం

మా ఊరు ..

మాఊరి పేరు గాంధీనగరం .
మాఊరి కి ఒక చిన్న చరిత్ర వుంది .ఇప్పుడు మాఊరు చోట ,మాతాతగారినన్నాగారు వాళ్ళకి పొలాలు వుండేవట . రోజూ ఇక్కడకు వచ్చి వ్యవసాయం చేయించేవారట .మా ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది.వర్షాకాలములో ఆచెరువునిండి బాగాపొంగి పొర్లుతావుండేదట.ఒక్కొక్కసారి పొలాల్లోకి వెళ్ళినవారు రెండు ,మూడు రోజు లవరకూ ఇళ్లకు వెళ్లడానికి లేకుండా ఇబ్బంది పడేవారంట .ఇక్కడ పొలాలు ఉన్న నాలు కుటుంబాల వారు ఈ ఇబ్బందులు పడలేక ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలనుకొని గ్రామాన్ని యేర్పరుచుకొన్నరు .

అవి స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజులవటముతో" గాంధీనగరం"అని పేరుపెట్టేరట.

అలా మాఊరు" పంతొమ్మిదివందలముప్పైఎనిమిది "లో యేర్పడిందనమాట .ఆనాలుగు కుటుంభాల వారి పిల్లలు ,మనుమలే మాఊరిజనాబా .మాఊరిజనాబా రెండువందలకంటే ఎక్కువుండదు . అందరూ ఒకరికొకరు దగ్గరివాళ్ళకే పెళ్ళిళ్ళుచేసుకోవడముతో ఊరిలో పెళ్ళైనా ,పేరంటమైనా అందరూ కలసి మెలసి చేసుకొంటాము .

22, అక్టోబర్ 2009, గురువారం

పోషకాలు మెండుగా వుండే శ్రీ ఫలం .

కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి.కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు.కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే .వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి .కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు .
కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది .ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది .కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు .
మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు .

కార్తీకవనభోజనాలు

ప్రకృతితో భంధాన్ని ఏటా గుర్తు తెచ్చేదే కార్తీకమాసం .ఈమాసంలో పేద దనిక తేడాలు లేకుండా ఊరంతా కలసి వనాలలో సామూహిక భోజనాలు చేయడం మన సంప్రదాయం.పిల్ల పాపలు పెద్దల తో కలసి ఆడి పాడి సంతోషాన్ని పంచుకొంటారు .


కార్తీకమాసములోనే వనభోజనాలకు ఎందుకు వెళతారంటే - వర్షాకాలము తరువాతే ఈ మాసము వస్తుంది కాబట్టి వనాలన్నీ పచ్చగా వుంటాయి .అందరిలోనూ వుత్సాహము వెల్లి విరుస్తుంది . పల్లె వాసులంతా ఊరికి దగ్గరలో వున్న వనాలకు వెళ్లి ..సహపంక్తి భోజనాలు చేస్తారు .భోజనములో రుచికంటె ,అందరం ఒక చోట కలిసామన్న అనుభూతి మరింత ఆనందాన్నిస్తుంది .ఎలాంటి అడ్దుగోడలు లేకుండా ,బేషజాలకు పోకుండా ఈకార్యక్రమములో పాల్గుంటారు .ఆట,పాటలతో రోజంతా వుత్సాహంగా గడుపుతారు.

ముక్యం గా రావి వుసిరి చెట్ల కింద భోజనాలు ఎందుక చేస్తారంటే ప్రకృతి తో మనిషికున్న బంధాన్ని గుర్తు చేసేందుకు. కలసి భొజనము చేయడములో వున్న సంతృప్తి, ఆనందము దేనిలోను వుండదు కుటుంభం,గ్రామం ,సమాజము వీటన్నింటినీ పటిష్టమంగా వుంచేవి అనుబంధాలే... . అలాంటి బంధాలకు బలాన్ని అందించే దివ్యౌషదం వనభోజనాలు .

16, అక్టోబర్ 2009, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి పండుగ లో ఒక ప్రత్యేఖత ఉంది .దుష్టశిక్షణ ద్వారా జనవళికి శాంతిని ప్రసాదించిన పర్వదినం.దీపాలువెలిగించి ,ఇంటింటినీ అలంకరించుకొని పెద్దలుతమసంతొషాన్ని ప్రకటిస్తారు.పిల్లలు బాణాసంచా కాల్చి తాము వినోదించడమే కాక చూపరులందరినీ ఆనందపరుస్తారు . ఎన్నిపండుగలు వున్నా, దీపావళి కి సాటి రాగల వేడుక మరొక దానికి లేదు . టపాసులు కాల్చేటప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్త .
అందరికీ దీపావళి శుభాకాంక్షలు .

9, అక్టోబర్ 2009, శుక్రవారం

పశ్చిమావని ...సిరులగని

ఎటుచూసినా పచ్చదనం ..పైటేసిన పడుచులా మాగాణి భూముల్లొ పైరుపచ్చని పంటలు ,గోదావరి పరవళ్ళు , ఉరకలు వేసే పంట కాల్వలు, అప్పుడప్పుడు,ఆగ్రహించినా ఎల్లప్పుడూ గోదారమ్మ చల్లని చూపులతో డెల్టా భూముల్లో పండే సిరులు ,పుష్కలమైన జలవనరులు ,వాణిజ్య పంటలతో కళకళలాడే మెట్ట పొలాలు ,అడవితల్లి ఒడిలో సేదదిరే గిరిజనం ,అటు సాగరతీరం ,ఇటు ఎత్తైన పాపికొండలు ,కనువిందు చేసే తుర్పుకనుమలు ,ఇదే ..ఇదే మాపచ్చని పశ్చిమ గోదావరి .


సాదరంగా ఆహ్వానించే మనస్తత్వం ,ఆప్యాయంగా పలకరించి ఆదరించే మంచితనం ,వచ్చినవారిని అన్ని రుచులతో మైమరపించే మంచితనం.. అందుకే గోదావరివాసులంటే అందరి లోను ప్రత్యేకత .


ఎందరో మహానుభావులు, తెలుగు సాహిత్య చరిత్రకు వన్నెతెచ్చిన చిలకమర్తి ,కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన దేవరకొండ బాలగంగాధరతిలక్ ,మన్యంవీరుడు అల్లూరిసీతారామరాజు ,గ్రందాలయోద్యమానికి బాటలు వేసిన ఎందరో మహానుబావులు ,స్వాతంత్రం కోసం ప్రాణాలొడ్డి,కారాగారాలకు వెళ్ళిన మరెందరో సమరయోదులు , సినీ పరిశ్రమలో మెగాస్టార్ , దర్సకరత్న దాసరి,కోడిరామకృష్ణ ,వంటి ఉద్దండులు,దర్సకులు,సాంకేతికనిపుణులు,సగర్వంగాచాటే చరిత్రకు సువర్ణాక్షరాలు వీళ్ళు. పశ్చిమావనికి ఇది ఎనబైమూడవ వసంతం .బౌగోళికంగా ,సామాజికంగా ,చారిత్రకంగా పశ్చిమావని ఇన్ని విజయలు సొంతం చెసుకొందంటే ఆ ఘనత ముమ్మటికీ మనది ,మనముందుతరాలవారిదే .