సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ముఖ్యముగాతమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియి కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.
తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి,సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది
.సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు.
మా జిల్లాలో అత్తిలోను,తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు లోనూ షష్టి ఉత్సవాలు బాగా జరుగుతాయి.
చిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో" యాదవోలు" అనే ఊరు వెళ్ళే వాళ్లము. అక్కడ బాగా జరుగుతుంది. మేము,తెలిసినవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు అందరమూ కలిసి ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు అవి తిరిగి మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .అప్పుడు షష్టి కి స్కూల్ కి సెలవుండేది.(ఇప్పుడు చాలా మంది పిల్లలకి సుబ్రహ్మణ్య స్వామి షష్టి అనే ఓ పండుగ ఉంటుందనే తెలీదేమో ) .
ఇప్పుడైతే మా ఉళ్ళో శివాలయం లోనే సుబ్రహ్మణ్య స్వామి ని ప్రతిష్టించారు. ఇక్కడికే వెళ్తున్నామంతా..మా సాయి , నేను రాను బడుంది అన్నా బలవంతంగా వాడిని తీసుకునే ఉదయం గుడికి వెళ్లొచ్చాను..